గుజరాత్లో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. పార్లమెంట్ ఎన్నికల కోసం ప్రకటించిన ఇద్దరు అభ్యర్థులు పోటీకి విముఖత వ్యక్తం చేశారు. గుజరాత్లోని వడోదర సెగ్మెంట్ నుంచి సిట్టింగ్ ఎంపీ రంజన్ భట్ను బరిలోకి దింపగా.. తాజాగా ఆమె పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని రంజన్ భట్ ఎక్స్ (గతంలో ట్విటర్) ద్వారా వెల్లడించారు. ఆమె అభ్యర్థిత్వాన్ని బీజేపీలోని పలువురు తీవ్రంగా వ్యతిరేకించడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
వడోదర లోక్సభ స్థానం నుంచి ఆమెను మళ్లీ నామినేట్ చేయాలనే బీజేపీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. నగరంలోని పలు ప్రదేశాలలో బ్యానర్లు కూడా ప్రదర్శించారట. 2014లో జరిగిన ఉప ఎన్నికలో ప్రధాని మోదీ ఆ స్థానం నుంచి తప్పుకోవడంతో భట్ పోటీ చేసి గెలిచారు. అనంతరం ఇదే స్థానం నుంచి 2019లోనూ బరిలోకి దిగి విజయం సాధించారు.
అలాగే సబర్కాంత లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి భిఖాజీ ఠాకూర్ కూడా ఎన్నికల్లో పోటీ చేయడం లేదని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతో ఎన్నికల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. ఠాకూర్పై కూడా స్థానిక నేతల అసంతృప్తినే కారణం. అయితే, ఈ పరిణామాలను చక్కదిద్దేందుకు బీజేపీ అధిష్ఠానం రాష్ట్ర నాయకత్వానికి మార్గనిర్దేశకం చేసినట్లు సమాచారం. కాగా, గుజరాత్లోని 26 లోక్సభ స్థానాలకు మే 7వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి.
Spread the love 07.10.2024 గుడిలో ఇత్తడి సామాన్లు కొట్టేసిన గోపిరెడ్డి అనుచరులు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ నేతను కిడ్నాప్ చేసిన వైసీపీ రౌడీలు ఐదు నెలలుగా జీతాలు అందడంలేదని డైలీవేజ్ వర్కర్లు […]
Spread the love *ఎన్టీఆర్ జిల్లా, జులై 05, 2024* యూపీఎస్సీ ఈపీఎఫ్వో, ఈఎస్ఐసీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు ఈ నెల 7న విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలి 25 కేంద్రాల్లో 7,834 మంది […]
Spread the love చేనేతకు చేయూతనిస్తాం సుజనా చౌదరి చేనేత వస్త్రాలను ఆదరించి చేనేత కార్మికులను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పశ్చిమ నియోజకవర్గ బిజెపి ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) అన్నారు. […]