గుజరాత్లో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. పార్లమెంట్ ఎన్నికల కోసం ప్రకటించిన ఇద్దరు అభ్యర్థులు పోటీకి విముఖత వ్యక్తం చేశారు. గుజరాత్లోని వడోదర సెగ్మెంట్ నుంచి సిట్టింగ్ ఎంపీ రంజన్ భట్ను బరిలోకి దింపగా.. తాజాగా ఆమె పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని రంజన్ భట్ ఎక్స్ (గతంలో ట్విటర్) ద్వారా వెల్లడించారు. ఆమె అభ్యర్థిత్వాన్ని బీజేపీలోని పలువురు తీవ్రంగా వ్యతిరేకించడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
వడోదర లోక్సభ స్థానం నుంచి ఆమెను మళ్లీ నామినేట్ చేయాలనే బీజేపీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. నగరంలోని పలు ప్రదేశాలలో బ్యానర్లు కూడా ప్రదర్శించారట. 2014లో జరిగిన ఉప ఎన్నికలో ప్రధాని మోదీ ఆ స్థానం నుంచి తప్పుకోవడంతో భట్ పోటీ చేసి గెలిచారు. అనంతరం ఇదే స్థానం నుంచి 2019లోనూ బరిలోకి దిగి విజయం సాధించారు.
అలాగే సబర్కాంత లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి భిఖాజీ ఠాకూర్ కూడా ఎన్నికల్లో పోటీ చేయడం లేదని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతో ఎన్నికల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. ఠాకూర్పై కూడా స్థానిక నేతల అసంతృప్తినే కారణం. అయితే, ఈ పరిణామాలను చక్కదిద్దేందుకు బీజేపీ అధిష్ఠానం రాష్ట్ర నాయకత్వానికి మార్గనిర్దేశకం చేసినట్లు సమాచారం. కాగా, గుజరాత్లోని 26 లోక్సభ స్థానాలకు మే 7వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి.
Spread the love నూతన రైల్వే లైన్ ప్రాజెక్టులతో తెలుగు రాష్ట్రాలకు మేలు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ న్యూఢిల్లీ/విజయవాడ:- నూతన రైల్వే లైన్ ప్రాజెక్టుల మంజూరుపై కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై కేంద్ర […]
Spread the love *08.21.2024* మాది పేదల ప్రభుత్వం.. ప్రజా సమస్యల పరిష్కారమే మా లక్ష్యం మంత్రి అనగాని సత్యప్రసాద్ – మాజీ మంత్రి కెఎస్ జవహర్ వచ్చిన అర్జీదారులు చిరునవ్వుతో తిరిగి వెళ్లేలా చూస్తోన్నాం […]
Spread the love రాష్ట్రంలో పేద ప్రజలు ఎవరు ఆకలితో ఉండకూడదు అన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్న క్యాంటీన్లను పునః ప్రారంభించారని 47వ డివిజన్ జనసేన అధ్యక్షుడు వెంపల్లి గౌరీ శంకర్ స్పష్టం […]