కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ లోక్ సభ అభ్యర్థి దానం నాగేందర్పై సొంత పార్టీ నేత రాజుయాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా ఎంపీ టిక్కెట్ ఎలా తీసుకుంటారు? అని ప్రశ్నించారు. బుధవారం రాజుయాదవ్ మీడియాతో మాట్లాడుతూ… దానం నాగేందర్ బలమైన నేత అనుకొని టిక్కెట్ ఇచ్చారని, కానీ తన దృష్టిలో ఆయన బలమైన నాయకుడేమీ కాదన్నారు. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే ఎంపీ టిక్కెట్ తీసుకున్నందున అనర్హత వేటు వేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు చెప్పారు.
పార్టీలు మారి వచ్చి టిక్కెట్ దక్కించుకున్న ఆయన… రేపు గెలిచాక మరోసారి పార్టీ మారడనే గ్యారెంటీ ఏమిటి? అని ప్రశ్నించారు. పార్టీ అధిష్ఠానం టిక్కెట్ ఇచ్చింది కాబట్టే తాము వ్యతిరేకించడం లేదన్నారు. కానీ ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేయాలని డిమాండ్ చేశారు.
దానంపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తూ ముందు స్పీకర్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఆయన ఎలాంటి చర్య తీసుకోనందున హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసినట్లు చెప్పారు. దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పోటీ చేస్తేనే గెలుస్తాడన్నారు. తాను కోవర్టును కాదని నిరూపించుకోవాలంటే రాజీనామా చేయాలన్నారు.
Spread the love ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. ఈ నెల 15న కవితను ఈడీ అధికారులు ఢిల్లీలోని […]
Spread the love ట్యాంక్ బండ్ కాదు ఇది గుదిబండ అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు అన్నారు. ఈ రోజు పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్ […]
Spread the love ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రికి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క స్వాగతం పలికారు. ఆలయ ఈవో, పండితులు […]