Home Andhra Pradesh ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన యార్లగడ్డ విజయవాడ రూరల్

ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన యార్లగడ్డ విజయవాడ రూరల్

6
0

ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన యార్లగడ్డ విజయవాడ రూరల్ : ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు శనివారం ఉదయం పంపిణీ చేశారు. విజయవాడ రూరల్ మండలం అంబాపురం గ్రామంలోని శనివారం ఉదయం లబ్ధిదారుల వద్దకు వెళ్లి వితంతు, వికలాంగ, వృద్ధాప్య పింఛన్లను అందించారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్న ఆయన వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ జూన్ ఒకటో తేదీ ఆదివారం రావడంతో ఒకరోజు ముందుగానే పింఛన్లు పంపిణీ చేసిన ఘనత తమ ప్రభుత్వానికి దక్కింది అన్నారు. నియోజకవర్గంలోని అర్హులైన లబ్ధిదారులందరికీ పింఛన్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here