Home Andhra Pradesh సుజనా పక్కా లోకల్-30వేలు మెజారిటీ గ్యారంటీ ప్రజల మనసులను సుజనా గెలుచుకున్నారు

సుజనా పక్కా లోకల్-30వేలు మెజారిటీ గ్యారంటీ ప్రజల మనసులను సుజనా గెలుచుకున్నారు

3
0

 


సుజనా పక్కా లోకల్-30వేలు మెజారిటీ గ్యారంటీ ప్రజల మనసులను సుజనా గెలుచుకున్నారు

ఓటమి భయంతోనే  వైసీపీ నేతల దుష్ప్రచారం

జాగ్రత్తగా మాట్లాడాలని పోతిన మహేష్ కు నగరాల నేతల వార్నింగ్

వైసీపీ నేతలకు పశ్చిమ బీజేపీ నేతల కౌంటర్

విజయవాడకు సుజనా చౌదరి పక్కా లోకల్ అని, 30వేల ఓట్ల మెజారిటీతో పశ్చిమలో ఎన్డీఏ గెలుపు ఖాయమని పశ్చిమ బీజేపీ నేతలు జోస్యం చెప్పారు. వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఓటమి భయంతోనే వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. పోతిన మహేష్ వైసీపీ నుంచి ప్యాకేజీ తీసుకుని ఎన్డీఏకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నా, ఎవరూ నమ్మే స్థితిలో లేరని బీజేపీ నేతలు అన్నారు. సుజనా చౌదరి నాన్ లోకల్ అని జరుగుతున్న ప్రచారాన్ని బీజేపీ నాయకులు ఖండించారు. భవానీపురం బీజేపీ కార్యాలయంలో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, సీనియర్ నేతలు పైలా సోమినాయుడు, పోతిన వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. సుజనా చౌదరి భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని అడ్డూరి శ్రీరామ్ జోస్యం చెప్పారు. ప్రలోభాలకు నగరాలు లొంగుతున్నారన్న ఆరోపణలను శ్రీరామ్ తీవ్రంగా ఖండించారు. ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తే సహించేది లేదని వైసీపీ నేతలను శ్రీరామ్ హెచ్చరించారు. సుజనా ఇప్పటికే ప్రజల మనసు గెలుచుకున్నారన్నారు. సుజనా పక్కా లోకల్ అని పైలా సోమినాయుడు అన్నారు. సుజనా స్వగ్రామం విజయవాడకు కూతవేటు దూరంలోనే ఉందని, ఆయన తండ్రి విజయవాడ పాల ప్రాజెక్ట్ లో ఇంజనీర్ గా పనిచేశారని, సుజనా కుటుంబాలు   విజయవాడ లోనే ఉన్నాయని పైలా గుర్తు చేశారు. వైసీపీ అభ్యర్థి ఆసిఫ్ కు రాజకీయ అవగాహన లేదని,  ఆయన వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని సోమినాయుడు అన్నారు. విజన్ ఉన్న నాయకుడు సుజనా అని, అందుకే తాము ఆయనకు మద్దతు పలికామని చెప్పారు.  పోతిన మహేష్  మాటలను ఎవరూ పట్టించుకోరని, ఆయన మాటలకు విలువలేదని వెంకటేశ్వరరావు దుయ్యబట్టారు. ఈ సమావేశంలో పోతిన బేస్ కంఠేశ్వరుడు, రాంపిల్ల శ్రీను, బెవర శ్రీను, పీసా కుట్టి పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here