దిగ్విజయంగా ముగిసిన 34వరోజు ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారంనందివాడ మండలంలో విస్తృతంగా పర్యటన
ఉదయం రుద్రపాక…గాజులపాడు..గోపాలపురం.బండివాని గూడెం….సాయంత్రం పోలుకొండ… శంకరంపాడు గ్రామాల్లో గడపగడప ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే నాని
చంద్రబాబును నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తలపెట్టడమే
చంద్రబాబు మేనిఫెస్టో కాగితాలకే పరిమితం
మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ అమలు చేసి…31 లక్షల ఇళ్ల నిర్మాణం…అమ్మఒడి…చేయూత లాంటి పథకాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్ దే
నందివాడ30:ఎమ్మెల్యే కొడాలి నాని 34వరోజు ఎన్నికల ప్రచారం దిగ్విజయంగా ముగిసింది. ఉదయం రుద్రపాక…గాజులపాడు..గోపాలపురం…. బండివాని గూడెం….సాయంత్రం పోలుకొండ… శంకరంపాడు గ్రామాల్లో ఎమ్మెల్యే నాని విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే కొడాలి నానికు గ్రామ గ్రామాన వైఎస్ఆర్సిపి నాయకులు ఘన స్వాగతం పలికారు.పోలుకొండ గ్రామ ప్రముఖులు పిన్నమనేని రవీంద్ర…. ఎమ్మెల్యే కొడాలి నాని సమక్షంలో వైసీపీలో చేరారు.పార్టీ శ్రేణులు…. స్థానికులతో కలిసి ఎమ్మెల్యే నాని గడపగడపకు ప్రచారాన్ని నిర్వహించారు. ప్రజలకు అభివాదాలు చేస్తూ ప్రచారాన్ని నిర్వహిస్తున్న ఎమ్మెల్యే కొడాలి నానికు, అడుగడుగునా మంగళ హారతులతో మహిళా సోదరీమణులు స్వాగతం పలుకగా,పూల మాలలతో ప్రజలు సత్కరించారు.ప్రచారంలో భాగంగా గ్రామాల్లోని దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించిన ఎమ్మెల్యే కొడాలి నాని…. క్రైస్తవ చర్చిల్లో నిర్వహించిన ప్రార్థనల్లో పాల్గొన్నారు. వైసిపి ప్రభుత్వం చేసిన మంచిని….. ఎమ్మెల్యే నాని చేసిన వ్యక్తిగత సహాయాన్ని గుర్తు చేసుకుంటు స్థానిక ప్రజానీకం ఎమ్మెల్యే కొడాలి నానికు వివిధ రూపాల్లో తమ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. పలుచోట్ల ఆయా ప్రాంతాల పెద్దలు….నాయకులు… అభిమానులు…. ప్రజలు…. ఎమ్మెల్యే కొడాలి నానిను తమ ఇళ్లలోకి ఆహ్వానిస్తూ ఆత్మీయ ఆతిథ్యం ఇవ్వడమే కాక….. వివిధ రూపాల్లో ఆత్మీయ సత్కారాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ జగన్కు ఓటు వేస్తే పథకాలు అన్ని వస్తాయని.. చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలు ఆగిపోతాయని ఎమ్మెల్యే కొడాలి నాని పేర్కొన్నారు. చంద్రబాబును నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తలపెట్టడమేనని వ్యాఖ్యానించారు. చంద్రబాబు రైతులకు ఎప్పుడైన రైతు భరోసా ఇచ్చాడా అంటూ ప్రశ్నించారు. జగన్ స్కీం అయినా రైతు భరోసాను చంద్రబాబు రెట్టింపు ఇస్తాడంటే ఎవరైనా నమ్ముతారా అంటూ కొడాలి నాని పేర్కొన్నారు. సీఎం జగన్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ అమలు చేశాడని…31 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టామని, అమ్మఒడి, చేయూత లాంటి పథకాలు ఇచ్చిన ఘనత వైసీపీ ప్రభుత్వం దేనని ఆయన పేర్కొన్నారు. వాలంటీర్ల ద్వారా నేరుగా పెన్షన్ ఇచ్చిన ఘనత జగన్దేనన్నారు. అమ్మ ఒడిని 17వేలకు పెంచామన్నారు. పెన్షన్ను పెంచి 2028, 2029 నాటికి 3500 పెన్షన్ ఇస్తామన్నారు. చంద్రబాబు ఏరోజు అవ్వతాతలకు పెన్షన్ ఇవ్వలేదని కొడాలి నాని అన్నారు. చంద్రబాబు నీ స్కీమ్లు ఏమిటి… మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసావు కదా అయ్యా నీ పేరు చెప్తే ఏ ఒక్కరికైనా ఒక్క స్కీమైనా గుర్తుకు వస్తుందా అంటూ ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో నందివాడ మండల ఎంపీపీ పేయాల ఆదాం, జడ్పిటిసి కందుల దుర్గాకుమారి, ఏపీ టూరిజం డైరెక్టర్ నగుళ్ళ సత్యనారాయణ, కృష్ణాజిల్లా యువజన విభాగ అధ్యక్షుడు మెరుగుమాల కాళీ,కో-ఆపరేటివ్ బ్యాంక్ ప్రెసిడెంట్ కొండపల్లి రంగారెడ్డి, గుడివాడ నియోజకవర్గం బూత్ కమిటీ ప్రెసిడెంట్ బట్టిపాటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీలు పిట్ట విశ్రాంతమ్మ, గుత్తా సత్యనారాయణ (చిన్ని), గుజ్జుల చైతన్య జ్యోతి, సచివాలయ కన్వీనర్ చైర్మన్ దేశిరెడ్డి రామ్మోహన్ రెడ్డి, వ్యవసాయ సలహా మండలి కమిటీ చైర్మన్ కొండపల్లి కుమార్ రెడ్డి, సర్పంచులు వసంతల సత్యవతి, గూడపాటి రజిని, జాజుల జోత్స్నా, *పోలుకొండ, శంకరం పాడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు* కోపరేటివ్ బ్యాంక్ ప్రెసిడెంట్ ఆళ్ల సాంబయ్య, తోట సతీష్, మానేపల్లి నాని, గరికి సురేష్, పిన్నమనేని అంజిబాబు, గొట్టుముక్కల ఉమాపతిరాజు, చింతగుంట తాతబ్బాయి, రుంజల మల్లయ్య, నూలు మహేష్, చింతగుంట రమేష్, రుంజల రవీంద్ర, చింతగుంట యోహాను, బాయిరెడ్డి మహేష్, చింత తామస్, పులవర్తి రామారావు, దిండి క్రీస్తు రాజు, కంభం మల్లయ్య, మద్దాల దయాసాగర్, రంజాల దానియేలు, బట్టు తంబి, చింతగుంట విల్సన్ బాబు, కంభం నవీన్, పులవర్తి పండు, చిన్నం శాంతియ్య, పులవర్తి రమణ, దారం బాలాజీ, చిన్నం లాజర్, పల్లి ఆశీర్వాదం, పల్లి సుబ్బయ్య, బుర్ర తోటయ్య, రుంజల సంసోను, పందుల మోక్షబలా, పులి సంతోషం, దాసరి నాయుడు, చింతగుంట ఏసు పాదం, రుంజల యోహాను, బట్టు మార్కు, లంకపల్లి శ్యాంబాబు, చింత చిన్న మోషే, *నందివాడ మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు* మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మొండ్రు వెంకటేశ్వరరావు, మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ తోట నాగరాజు, కందుల నాగరాజు, చింతాడ నాగూరు, పరిమి అమృత బాబు, పామర్తి మురళీకృష్ణ, బేతపూడి నవరత్నరాజు, రాజులపాటి చంద్రశేఖర్, కొండపల్లి చంద్రశేఖర రెడ్డి, కటికల సూర్యచంద్ర, రాజేష్, పూడి సుధాకర్ రావు, సకలాబత్తిన దిలీప్ కుమార్, మేడేపల్లి ప్రసాద్, పేయల శివ, నియోజకవర్గ పరిధిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పర్వతనేని ఆనంద్, గిరి బాబాయ్, పిల్లి బెనర్జీ, సూరపనేని కళ్యాణ్, తోట రాజేష్, ఘంటా సురేష్, పుల్లెట్టుకుర్తి వినయ్, చుండి బాబి, చుండూరి శేఖర్, నీరుడు ప్రసాద్, గుడివాడ టౌన్, రూరల్, , గుడ్లవల్లేరు మండలాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అనుబంధ విభాగాల నాయకులు, కొడాలి నాని అభిమానులు, పెద్ద సంఖ్యలో ప్రజానీకం పాల్గొన్నారు.