మచిలీపట్నం ప్రజలు నిజంగానే వాస్తవాన్ని గ్రహించాలి

Spread the love

 మచిలీపట్నం ప్రజలు నిజంగానే వాస్తవాన్ని గ్రహించాలి

ఎన్నికల ప్రచారం సాకుతో టిడిపి-జనసేన నాయకులు కార్యకర్తలు టార్గెట్ చేసిన వైసీపీ రౌడీ మూకలు

ప్రచారంలో గొడవలు సృష్టించడం తెదేపా-జనసేన నాయకులను కొట్టడం ఆ నెపాన్ని కొల్లు రవీంద్ర పై పోయడం పారిపాటిగా మారింది.

ప్రచారం పేరుతో వార్డులోకి వెళ్లడం టిడిపి జనసేన నాయకులు పై కవ్వింపు చర్యలు చేయడం అలవాటైపోయింది.

ఎలానో ఓడిపోతం అనే భయంతో గొడవలు సృష్టించి అల్లర్లు చేయాలని ఆలోచనలో పిల్ల నాయకుడు తెగ ఆరాట పడుతున్నారు.

ఎనిమిదో డివిజన్లో ప్రచారానికి వెళ్లి కర్రీ మహేష్ ఇంటి దగ్గరికి వచ్చేసరికి బాణా సంచా తో వారి కారు కింద న బాంబు లు పెట్టి కవ్వింపు చర్యలకు తెర లేపారు.

ప్రచారం చేసుకోకుండా ఈ కవ్వింపు చర్యలు ఏంటని ప్రశ్నించిన కర్రి మహేష్ ఇంటిపైకి దాడికి తేగబడ్డారు

పెద్ద పెద్ద రాళ్ళను ఇళ్లపైకి విసురుతూ ఇలలోకి వెళ్లి కర్రలతో మహిళలపై చేయి చేసుకున్నారు గంజాయి బ్యాచ్.

గంజాయి మత్తులో ఆడ మగ అని చూడకుండా దాడికి తెగబడుతున్నారు.

దాడిని ఎదురుగా చూస్తున్న పేర్ని కిట్టు మరింతగా ప్రోత్సహిస్తూ వారిని కొట్టండి వీరిని కొట్టండి అని హుకుం పలుకుతున్నాడు

మొన్న సాక్షాత్తు అంబేద్కర్ గారి జయంతి రోజు ఆయన విగ్రహం ముందే తెలుగుదేశం పార్టీపై దాడి చేయాలని సైగ చేయడంతో అక్కడ చూస్తున్న ప్రజలు నివ్వెరపోయారు.

ఇలా రౌడి ఇజన్ని ప్రోత్సహిస్తున్న వ్యక్తిని ఎన్నుకుంటే మచిలీపట్నం మరో బీహార్ ని చేస్తారని ప్రజలు భయపడుతున్నారు తప్పకుండా మే 13న గంజాయి బ్యాచ్ కి రామ్ రామ్ చెప్తామని గట్టిగా హెచ్చరిస్తున్నారు.

తండ్రి రాజకీయంలో నటన చూపిస్తే…. కొడుకు రౌడీయిజంలో తెగ నటిస్తున్నాడని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *