ఎమ్మెల్యే సుజనా చౌదరిని పరామర్శించిన పశ్చిమ మైనార్టీ నేతలు

ఎమ్మెల్యే సుజనా చౌదరి ను పశ్చిమ నియోజకవర్గంలోని ముస్లిం, మైనారిటీ నేతలు పరామర్శించారు.
లండన్ పర్యటనలో ప్రమాదవశాత్తు జరిగిన ఘటనలో సుజనా చౌదరి కుడి భుజానికి శస్త్ర చికిత్స జరగడంతో వైద్యుల సూచనల మేరకు ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు.
పశ్చిమ నియోజకవర్గం లోని టీడీపీ ముస్లిం , మైనారిటీ నేతలు బుధవారం హైదరాబాదులోని వారి నివాసంలో సుజనాను కలిసి పరామర్శించారు తమ ఎమ్మెల్యే త్వరగా కోలుకొని ప్రజాసేవకు పునరంకితం కావాలని అల్లాని వేడుకున్నారు. రాష్ట్ర టీడీపీ మైనారిటీ నాయకులు షేక్ తాజుద్దీన్, మైలవరం మైనార్టీ సెల్ నాయకులు గౌస్ మహమ్మద్, జిలానీ అహ్మద్, అబ్దుల్ ఖాదర్, అబ్దుల్ మాతిన్, అబ్దుల్ మెహబూబ్ తదితరులు పాల్గొన్నారు.