జగనన్నతోనే పేద, మధ్య తరగతి వర్గాల భవిష్యత్తుకు భరోసా
రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
నిరుపేదల జీవన ప్రమాణాలు పెంచడమే అసలైన అభివృద్ధి అని నమ్మి.. సంక్షేమ పథకాలు అందిస్తున్న జగనన్నను మరలా ముఖ్యమంత్రిని చేసుకోవలసిన బాధ్యత మనందరిపై ఉందని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. వెలంపల్లి శ్రీనివాసరావు అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ 28వ డివిజన్ లో శుక్రవారం ఆయన విస్తృత ప్రచారం నిర్వహించారు. వెలంపల్లి సోదరుడు వెలంపల్లి రాఘవతో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు, అభివృద్ధిని వివరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, నగదు బదిలీలు గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయలేదని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అన్నారు. తన 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో చంద్రబాబు పేదలు, మహిళల ఆర్థికాభివృద్ధి గూర్చి ఏనాడూ ఆలోచించలేదని విమర్శించారు. కానీ సంక్షేమ పథకాలను అసామాన్యంగా అమలు చేస్తూ ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుపరిపాలన అందిస్తున్నారని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల దయాదాక్షిణ్యాల మీద సంక్షేమ పథకాలు అందేవని, కానీ నేడు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ఇంటి వద్దకే సంక్షేమ ఫలాలు అందేలా సీఎం జగన్ చేశారని వెల్లడించారు. విద్య, వైద్యం, గృహ నిర్మాణం.. ఇలా ప్రతీ అంశంలోనూ జగనన్న ప్రభుత్వం సాధించిన ప్రగతిని ఇంటింటికీ వెళ్లి వివరిస్తున్నట్లు తెలిపారు. ఈ అభివృద్ధి మరింతగా కొనసాగాలంటే రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు.
అగ్రవర్ణ పేదలకు ఆర్థిక చేయూతఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలనే కాకుండా, ఇవ్వని పథకాలనూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు పరిచారని మల్లాది విష్ణు చెప్పుకొచ్చారు. మేనిఫెస్టోలో చెప్పకపోయినా రెడ్డి, కమ్మ, బ్రాహ్మణ, ఆర్యవైశ్య, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర అగ్రవర్ణ సామాజికవర్గాల్లోని పేద మహిళలకు కూడా మేలుచేయాలన్న సత్సంకల్పంతో ఈబీసీ నేస్తం పథకాన్ని ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు. రెండో విడత ద్వారా సెంట్రల్లో 2,593 మందికి రూ. 3.65 కోట్ల లబ్ధి చేకూర్చగా.. తొలి విడతలో 1,947 మంది ఖాతాలలో రూ. 2 కోట్ల 92 లక్షల 5 వేలు జమ చేసినట్లు చెప్పారు. మొత్తంగా రూ. 6.81 కోట్ల మేర లబ్ధి చేకూర్చినట్లు వివరించారు. అటువంటి ప్రభుత్వానికి అండగా నిలవాలని అక్కచెల్లెమ్మలను కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఐదేళ్లలో అక్షరాల రూ. 23.11 కోట్ల సంక్షేమం
మహిళా సంక్షేమం కోసం మన రాష్ట్రంలో అమలు చేస్తునన్ని పథకాలు దేశంలో మరే రాష్ట్రంలో అమలు కావడం లేదని మల్లాది విష్ణు అన్నారు. వైఎస్సార్ పింఛన్ కానుక ద్వారా డివిజన్లో ప్రతి నెలా 922 మందికి ఇంటి వద్దకే ఠంఛన్ గా పింఛన్ అందజేయడం జరుగుతోందన్నారు. వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా 857 మంది అక్కచెల్లెమ్మలకు రూ. 2.64 కోట్లు., అమ్మఒడి పథకం ద్వారా 867 మంది తల్లులకు రూ. 2.66 కోట్లు., చేదోడు ద్వారా 71 మందికి రూ. 14.90 లక్షలు., ఈబీసీ నేస్తం ద్వారా 139 మందికి రూ. 35.10 లక్షలు., జగనన్న విద్యాదీవెన ద్వారా 570 మందికి రూ. 2.04 కోట్లు., వసతి దీవెన ద్వారా 525 మందికి రూ. 62 లక్షలు., కాపు నేస్తం ద్వారా 60 మందికి రూ.18.90 లక్షలు., సున్నావడ్డీ పథకం ద్వారా 1,105 మందికి రూ. 32.50 లక్షలు., వైఎస్సార్ చేయూత ద్వారా 303 మందికి రూ. 1.30 కోట్ల సంక్షేమాన్ని అందజేసినట్లు తెలిపారు.
జగనన్న సురక్ష నభూతో నభవిష్యత్
ప్రజలకు 11 రకాల సేవలను ఉచితంగా అందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన జగనన్న సురక్ష కార్యక్రమం రాష్ట్ర చరిత్రలో ఓ సువర్ణ అధ్యాయమని మల్లాది విష్ణు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి 46 లక్షల మంది ఇళ్లను 2.60 లక్షల మంది వాలంటీర్లు., 1.5 లక్షల మంది సచివాలయ సిబ్బంది., 3 వేల మంది మండల స్థాయి అధికారులు సర్వేచేసి.. 93.57 లక్షల మందికి కుల, ఆదాయ, జనన, మరణ, వివాహ, ఫ్యామిలీ మెంబర్ సహా 11 రకాల సర్టిఫికెట్లు రూపాయి ఖర్చు లేకుండా అందించారని పేర్కొన్నారు. దేశచరిత్రలో ఈ స్థాయిలో సమస్యలు పరిష్కరించి.. సర్టిఫికెట్లు జారీచేసిన దాఖలాలు లేవని మల్లాది విష్ణు అన్నారు. మూడు సార్లు అధికారంలో ఉండి.. ఇటువంటి ఏ ఒక్క మంచి కార్యక్రమాన్ని అయినా చంద్రబాబు చేపట్టారా..? సమాధానం చెప్పాలన్నారు. సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి 1,03,399 కుటుంబాలను వాలంటీర్లు సర్వే చేసి.. 36,367 మందికి పలు రకాల సర్టిఫికెట్లు అందజేసినట్లు తెలిపారు. అర్హులైన వారికి లబ్ధి చేకూర్చడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధికి జగనన్న సురక్ష ఒక నిదర్శనమని తెలియజేశారు.
గడప గడపకూ వెళ్లే ధైర్యం చంద్రబాబుకు ఉందా..?
టీడీపీ హయాంలో ప్రజలకు ఇంత మేలు చేశామని గడప గడపకూ వెళ్లి చెప్పే ధైర్యం చంద్రబాబుకు, తెలుగుదేశం నేతలకు ఉందా..? అని మల్లాది విష్ణు ప్రశ్నించారు. ఎంతసేపూ ప్రజలకు మేలు చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ప్రజాస్వామ్య పద్ధతుల్లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ఇంత జవాబుదారీతనంగా ప్రజల ముందుకు వెళ్లి చెప్పిన సంఘటన గతంలో ఎప్పుడూ లేదన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోను మాయం చేసిందని.. కానీ మేనిఫెస్టోను గడప గడపకూ తీసుకెళ్తున్న ఘనత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని మల్లాది విష్ణు అన్నారు. ప్రతీ కుటుంబానికి జగనన్న ప్రభుత్వం ఏ విధంగా సహాయపడిందో ఇంటింటికి వెళ్లి చెబుతున్నామని.. చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన 600 వాగ్దానాలపై మాట్లాడే ధైర్యం పచ్చ చొక్కాలకు ఉందా..? సమాధానం చెప్పాలన్నారు. 2014-19 మధ్య నగర ప్రజల కనీస అవసరాలను తీర్చడంలోనూ ఘోరంగా వైఫల్యం చెందిన తెలుగుదేశం నేతలకు.. ప్రజలను ఓట్లను అభ్యర్థించే నైతిక అర్హత ఎక్కడిదని ప్రశ్నించారు. కానీ ఈ ప్రభుత్వంలో సెంట్రల్లోని 96 సచివాలయాల పరిధిలో సగటున రూ. 3 నుంచి 5 కోట్ల సంక్షేమాన్ని ప్రతి ఒక్క సచివాలయంలో అందజేసినట్లు తెలిపారు. అటువంటి సంక్షేమ సారథి జగనన్నను తిరిగి ముఖ్యమంత్రి చేసుకునేందుకు.. వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని, ఎమ్మెల్యే అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాస్ లను అఖండ మెజారిటీతో గెలిపించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. కార్యక్రమంలో 33వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ శర్వాణీ మూర్తి, నాయకులు కనపర్తి కొండా, గండూరి మహేష్, అఫ్రోజ్, బాబ్జి, యక్కల మారుతి, దత్తు, వెంకట్రావు, రిజ్వాన్, చిన్నారావు, స్వామి, దుర్గాప్రసాద్, పోలినాయుడు, మోహన్, శ్రీను, ఆర్కే, రాజారత్నం, ప్రేమ్, పార్టీ శ్రేణులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.