*గుడివాడలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయభేరీ యాత్ర-జన సముద్రమైన గుడివాడ వీధులు*
రోడ్ షో – పవన్ సభకు పోటెత్తిన ప్రజానికం
ఆదిత్య హృదయం ప్రతినిధి
*డబ్బు పోయిన బాధపడను- తిరిగి సంపాదించుకుంటాం -స్వేచ్ఛను కోల్పోతే సహించేది లేదు-వైసీపీ పాలనలో ప్రజల స్వేచ్ఛ కోసమే నేను పోరాడుతున్న-పవన్ కళ్యాణ్*
*గ్లాస్ గుర్తుపై ఓటు వేసి అభివృద్ధి ప్రదాత సోదరుడు వల్లభనేని బాలశౌరిను భారీ మెజార్టీతో గెలిపించాలి*
*మోడ్రన్ సైకిల్ పై వస్తున్న టిడిపి అభ్యర్థి వెనిగండ్ల రాము అరాచక వాదులను తొక్కుకుంటూ వెళతారు- బూతులు తిట్టే వారిని సైకిల్ చక్రం లేపి కొట్టుకుంటూ మరి విజయం సాధిస్తారు*
జననీరాజనాల మధ్య, వేలాదిమంది అభిమానుల వెంట రాగా-జాతరను తలపిస్తూ జరిగిన పవన్ రోడ్ షో.
ఏఎన్ఆర్ కళాశాల నుండి నెహ్రూ చౌక్ సెంటర్ వరకు జరిగిన రోడ్ షో.
ఏఎన్ఆర్ కళాశాల హెలిప్యాడ్ వద్ద పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికిన ఎంపీ వల్లభనేని బాలశౌరి, టిడిపి అభ్యర్థి వెనిగండ్ల రాము.
*వారాహి విజయభేరీ బహిరంగ సభలో పాల్గొన్న పవన్ కళ్యాణ్, ఎంపీ అభ్యర్ది బాల శౌరి,ఎమ్మెల్యే అభ్యర్ధి వెనిగండ్ల రాము*
*సభలో పవన్ కళ్యాణ్ పాయింట్స్*
దశాబ్ద కాలంగా జనసేన పార్టీని నేను నడుపుతున్నాను
కిందపడి, నలిగిపోయి, పోరాటాలు చేసి, దెబ్బలుతిని, అడ్డమైన వాళ్ల చేత బూతులు తింటున్నాం
ప్రజల కష్టాల కు నా వంతు సాయం చేయాలని తపన పడే వాడిని నేను
ప్రజాస్వామ్యం గడ్డు పరిస్థితుల్లో ఉంటే.. అడ్డుగోడగా నిలబడే వ్యక్తిని
చంద్రబాబును అన్యాయంగా అరెస్టు చేశారు.. అటువంటి అన్యాయం రేపు మీకూ జరగవచ్చు
రాజకీయ విభేదాలు ఉంటాయి.. కానీ కక్ష కట్టి మరీ ఇబ్బందులు పెట్టకూడదు
నేను జనసేనను కాపాడటానికి కాదు.. ఆంధ్రప్రదేశ్ ను కాపాడటానికి వచ్చాను
విజయవాడ గుడివాడ మధ్యో రోడ్డు గోతుల మయం
రోడ్లు ఏమో గోతులు… నాయకుల నోటి వెంట వచ్చేదేమో బూతులు.
పేకాట క్లబ్బులు ,దండాలు చెయ్యడానికి ఓపిక ఉంది, ప్రజలకు రోడ్లు వేయించడం, త్రాగునీరు అందించడానికి తీరికలేదు.
ఇదీ వైసీపీ ప్రజప్రతినిధులు నేటి యువతకు నేర్పుతున్న సంస్కారం
ల్యాండ్ టైటిల్ యాక్ట్ ద్వారా మన ఆస్తి పత్రాలు మొత్తం జగన్ లాక్కుంటన్నాడు
మన ముఖాన జిరాక్స్ కాపీలు పడేస్తే… వాటితో ఏం చేసుకోవాలి
ఒరిజినల్ డాక్యుమెంట్లు లేకుండా ఎవరైనా లోన్ లు ఇస్తారా
జిరాక్స్ కాపీలను తీసుకెళ్లి ఏం చేయాలో ప్రజలు ఆలోచన చేయండి
బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ప్రభుత్వం రావడం ఖాయం
అయితే అది ఎంత మెజారిటీ వస్తుందనేది ప్రజలే చెప్పాలి
వైసీపీ నాయకులకు కూడా మేము ఒక విధంగా సాయం చేస్తున్నాం
ల్యాండ్ టైటిల్ యాక్టు తో ఆస్తులు అన్యాక్రాంతం చేయడం ఖాయం
మద్యపాన నిషేధం అన్న వారు.. ఎపీలో మద్యాన్ని ఏరులై పారిస్తూ వ్యాపారిగా మారారు
సీపీయస్ రద్దు అన్న వ్యక్తి.. మాట తప్పారు
ఇంటింటికీ రక్షిత మంచినీరు అన్న వ్యక్తి.. నీరు లేకుండా చేశారు
కొడాలి నాని ని తిట్టాలని నాకేమీ వ్యక్తిగత ద్వేషం లేదు
మొన్న రాధాగారి పెళ్లి వేడుకలో కలిస్తే పలకరించాను
ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తే.. నా సొంత రక్తానికి కూడా ఎదురు తిరుగుతాను
ఎయిడెడ్ స్కూల్స్ లేకుండా చేసి.. పేదలకు మంచి విద్యను దూరం చేశారు
30వేల మంది ఆడవాళ్లు అదృశ్యం అయితే.. ఈ సీఎం కనీసం స్పందించరు
కాలువల్లో పూడికలు తీయక… నీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు
12లక్షల ఎకరాల్లో నేడు వరి దిగుబడి తగ్గిపోయింది.. దీనికి వైసీపీ చేతకాని తనం కారణం
వైసీపీ ప్రభుత్వం ఓడిపోయాక.. కాగితాల ముక్కులు జల్లండి
కొడాలి నాని ఓటమి చెందాక.. అటువంటి ఎగుర వేయండి
గుడివాడ నుంచి టీడీపీ అభ్యర్దిగా పోటీ చేస్తున్న వెనిగడ్ల రాముకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలి
ఇక్కడ నోరు పారేసుకునే ఎమ్మెల్యే నోరు కట్టడి చేయాలంటే.. వెనిగండ్ల రాముకే ఓటు వేయండి
రాజకీయ నాయకులు తిట్టే బూతులకు, తిట్లకు ట్యాక్స్ వేస్తే.. నిధులకు కొరత ఉండదని నానీపాల్కే చెప్పారు
వైసీపీ నాయకులు తిట్టిన ప్రతి తిట్టుకు పన్ను వేస్తే,, వైద్యం, విద్య పూర్తిగా ఉచితంగా ఇవ్వొచ్చు
ఎమర్జెన్సీ కాలంలో ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకం అయ్యాయి
పార్టీల పరంగా భిన్నాభిప్రాయాలు ఉంటాయి.. రాజకీయంగా విభేదించాలి
చంద్రబాబును, ఇతర నాయకులను, వారి ఇంట్లో ఆడవాళ్లను కూడా దూషిస్తే చూస్తూ ఊరుకోవాలా
అసలు డిబేట్ లేకుండా ఏకపక్షంగా నిర్ణయాలు చేస్తే ఎలా
డబుల్ డి ప్రభుత్వం.. దాడులు, దోపీడీ ప్రభుత్వానికి బుద్ది చెప్పాలి
భద్రత, స్వేచ్చే ఈ దేశానికి పట్టుకొమ్మ, వెన్నుముక
మన దేశంలో మనకు స్వేచ్చ లేకుంటే.. మేము ఊరుకోవాలా
తప్పు చేయనప్పుడు దమ్ము, ధైర్యంగా బతకాలి
మీ అందరికీ ధైర్యం ఇవ్వడానికే రాష్ట్రం మొత్తం పర్యటిస్తున్నా
ఇప్పటం గ్రామంలో అన్యాయంగా రోడ్డు విస్తరణ పేరుతో ఇళ్లును కూలగొట్టారు
ఎదురు తిరగాలి.. అడ్డుకోవాలి.. అప్పుడే దౌర్జన్యాలు ఆగిపోతాయి
మాట ఇస్తే.. ప్రాణాలు పోయినా వెనక్కి తీసుకోకూడదు
నేను వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్పాను
మనసు ఉంటే మార్గం ఉంటుందని.. బీజేపీ పెద్దలతో నేను మాట్లాడాను
ఎపీ లో జగన్ వచ్చాక కిరాయి మూకలను తెచ్చి దాడులు చేయించారు
ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను అన్యాయంగా పెట్టించి బెదిరించారు
ఎవరూ బతకడానికి లేదు.. అందరూ భయపడాలి అంటారు
జగన్ తాత కాలం నుంచి పక్కనోళ్ల ఆస్తులను దోచుకోవడం వారికి అలవాటు
అందుకే మీరు ఓటు వేయకపోతే చంపేస్తాం అన్న విధంగా చెబుతారు
చిరంజీవి, మహేష్, ప్రభాస్ లు వీళ్లకు నమస్కారాలు పెట్టాలి
ఎవరి పని వాళ్లు చేసుకుంటున్నప్పుడు .. మీకు నమస్కారాలు ఎందుకు
యన్టీఆర్ పేరుతో ఉన్న హెల్త్ యూనివర్సిటీ కి పేరు మార్పు ఎందుకునిజంగా యన్టీఆర్ పై అబిమానం ఉంటే.. ఆ పేరు తొలగించే వారాపొట్టి శ్రీరాములు బలి దానం చేస్తే.. ఈరోజు ఎపీ అనే నేల వచ్చిందిఉన్న పేర్లను తొలగించి.. వేరొకరి పేర్లను ఎలా పెడతారు
నేను భయపడే వ్యక్తిని కాను.. నా సినిమాలు ఆపుకుంటే ఆపుకో
స్వేచ్చను పోగొట్టుకున్నాక.. ఎన్ని వేల కోట్లు ఉన్న అది నిష్ప్రయోజనం
చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ఆయనను చాలా ధైర్యంగా చూశాను
ఎటువంటి పరిస్థితి అయినా ఎదుర్కొందాం అని చంద్రబాబు అన్నారుఆరోజే చంద్రబాబుకు మద్దతు ఇవ్వాలని అక్కడే నిర్ణయం తీసుకున్నాను
ఐదేళ్లుగా బెయిల్ పై బయట తిరుగుతున్న వ్యక్తి జగన్.. ముప్పై కి పైగా కేసులు ఉన్న వ్యక్తి
ఈ ఎన్నికలలో బాగా ఆలోచన చేసి ప్రజలు ఓట్లు వేయాలి
మీరు వైసీపీకి ఓటు వేస్తే.. మీ ఆస్తులు గాల్లో దీపం లాంటివి
జగన్ చెప్పిన మాటలు అమలు చేయకుండా మోసం చేసిన వ్యక్తి
జగన్ మాయ మాటలు నమ్మి ఓట్లు వేస్తే.. మీ ఆస్తులు మీరే పోగట్టుకున్నట్లే
కూటమి అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ విడుదల చేస్తాం
ఐదేళ్ళల్లో 20లక్షల ఉద్యోగాలు యువతకు ఇస్తాం
జనసేన నుంచి ఎంపీ అభ్యర్దిగా పోటీ చేస్తున్న బాలశౌరిని గెలిపించాలి…. సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా రాముని గెలిపించాలి.
ఎండను కూడా లెక్కచేయకుండా అన్ని ప్రాంతాలు తీరుగుతున్నానంటే.. అది ప్రజల కోసమేమెగా డ్సీ ఎఅన్నారు… అదీ లేదుఎక్కడ పడితే ఎక్కడ మట్టిని తవ్వేసి దోచుకంటున్నారు
మీకోసం నిలబడే వ్యక్తులను ప్రజలు ఎన్నుకోండి
భవిష్యత్ ను ఆలోచించి.. ఓటు వేసే ముందు ఆలోచన చేయండి
ఇటువంటి అవినీతి ప్రభుత్వాన్ని తరిమి కొట్టే బాధ్యత ప్రజలు తీసుకోవాలి
రాష్ట్రం హితం కోసం నిస్వార్ధంగా మూడు పార్టీలు కలిసి మందుకు వస్తున్నాయి
హలో ఎపీ. బై బై వైసీపీ
*వెనిగండ్ల రాము పాయింట్స్*
పవన్ కళ్యాణ్… ఆ పేరులోనే వైబ్రేషన్ ఉంది, మన గుడివాడ వనికి పోతుంది.
పవన్ కళ్యాణ్ గుడివాడ వచ్చినందుకు మేమంతా సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాం.
భయానిక వాతావరణం సృష్టిస్తున్న వైసీపీకి ఎదురు నిలబడమే కాక, ప్రజల క్షేమం కోసం అన్ని పార్టీలను ఏకం చేసిన ధీరుడు పవన్ కళ్యాణ్.
వైసీపీ అరాచకానికి అడ్డుకునేందుకు ఆయన ఒక్కసారి తొడగొడితే లక్షల మంది కదిలి వచ్చారు.
పవన్ కళ్యాణ్ స్ఫూర్తి, ఆయన ఇచ్చిన ధైర్యంతోనే తనలాంటి వారు ఎందరో పోరాడుతున్నారు.
పవన్ కళ్యాణ్ ఒకసారి కలిశాను, కానీ నాడు ఆయన చెప్పిన మాటలను నాలో ఎంతో పూర్తి నింపాయి.
రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి గెలుపు ఖాయం అయిపోయింది, కాకపోతే ఎన్ని సీట్లతో గెలుస్తామన్నదే ప్రశ్న అంతే.
*ఎంపీ వల్లభనేని బాలశౌరి పాయింట్స్*
నీట్ట మధ్యాహ్నం ఒంటి ఒంటి గంటకు, భగభగ మంటూ సూర్యుడు నడి నెత్తి మీదకు వచ్చినా సరే లెక్కచేయకుండా ఇంతమంది రావడం గొప్ప విషయం.
పవన్ కళ్యాణ్ అంటే ప్రజలకు ఉన్న అభిమానం మరోసారి కనిపిస్తుంది.
గుడివాడ లో రైల్వే గేట్లపై ఫ్లేవర్ల నిర్మాణానికి నిధులు సాధించాను, సిఎస్ఆర్ నిధులతో ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులను అభివృద్ధి చేశాను.
ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల అభివృద్ధికి మరింత కృషి చేస్తాను.
కూటమి అధికారంలోకి రాగానే పోలవరం పూర్తి కావడం ఖాయం, డెల్టా ప్రాంతానికి రెండు పంటలకు నీరు వచ్చి తీరుతుంది.
రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి గెలుపు ఖాయం అయిపోయింది.
కూటమి అధికారంలోకి రాగానే పోలవరం పూర్తి చేసి రెండు పంటలకు
పవన్ కళ్యాణ్ పర్యటనలో మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు, జనసేన ఇన్చార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, జనసేన, టిడిపి నాయకులు, మండల పార్టీల అధ్యక్షులు గుడివాడ నియోజకవర్గ పరిధిలోని జనసేన, టిడిపి పార్టీల నాయకులు, వేలాదిగా కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో ప్రజానీకం, మెగా అభిమానులు పాల్గొన్నారు.