ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయము, విజయవాడ. ది.06.05.2024
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎన్.టి.ఆర్.పోలీస్ కమీషనరేట్ పరిదిలో శాంతిభద్రతల నేపధ్యంలో పటిష్టమైన నిఘా.
రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమీషనరేట్ పరిదిలో రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కును వినియోగించుకొనుటకు నిర్భయముగా భయపక్షపాతాలు లేకుండా ఉండేందుకు పోలీసు వారు ఎప్పుడూ ప్రజలకు అండగా ఉంటారని తెలియజేస్తూ నిర్భయంగా ప్రజలందరూ వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని స్థానిక ప్రజలకు అవగాహన కల్పించి ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల నిర్వహణ కొరకు ప్రజలకు మేమున్నాము అనే భరోసా ఇచ్చేందుకు పోలీస్ కమిషనర్ శ్రీ పి.హెచ్.డి. రామకృష్ణ ఐ.పి.ఎస్. ఆదేశాల మేరకు డి.సి.పి.లు అధిరాజ్ సింగ్ రాణా ఐ.పి.ఎస్ కె.శ్రీనివాస రావు ఐ.పి.ఎస్ .టి హరికృష్ణ గార్ల పర్యవేక్షణలో ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిదిలో అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద సుమారు 6000 మంది లా & ఆర్డర్, ఏ.ఆర్., 10 ప్లటూన్ల ఏ.పి.ఎస్.పి.,12 కంపెనీల పారామిలటరీ బలగాలతో మరియు 1250 మంది ఎన్.ఎస్.ఎస్.వాలంటీర్లతో పటిష్టమైన బందోబస్త్ ఏర్పాటు చేయడం జరుగుతుంది.
ప్రజలు నిర్భయముగా భయపక్షపాతాలు లేకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్ని డివిజన్ల ఏరియాలలో ప్రతి రోజూ ఒకొక్క ప్రాంతం ఎంచుకుని సదరు డివిజన్ ఏ.సి.పి. ఆధ్వర్యంలో లా & ఆర్డర్, ఏ.ఆర్., ఏ.పి.ఎస్.పి., పారామిలటరీ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించి ఆయా ప్రాంతాలలోని ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతోంది.
సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో అక్రమ నగదు, మద్యం, ఓటర్లను ప్రలోభపెట్టే ఉచిత వస్తువుల పంపిణి, ఇతరత్రా ఎన్నికల నేరాలను అరికట్టేందుకు శాంతిభద్రతలకు సంబంధించిన మరియు పోలీసులు స్పందించదగిన సమాచారం అందించడానికి పోలీస్ కమిషనర్ శ్రీ పి.హెచ్.డి. రామకృష్ణ ఐ.పి.ఎస్.గారి పర్యవేక్షణలో ఎన్.టి.ఆర్. జిల్లా, విజయవాడ నగరంలోని కమాండ్ కంట్రోల్ నందు *టోల్ ఫ్రీ నెంబర్ : 1800-425-5049*గల రాష్ట్రవ్యాప్త సెంట్రల్ కంప్లైంట్స్ సెల్ ను ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ నేపధ్యంలో ఎన్.టి.ఆర్.పోలీస్ కమీషనరేట్ పరిదిలో లా & ఆర్డర్, ఎస్.ఈ.బి. అధికారులు మరియు సిబ్బంది కలిసి గత ఇదురోజులలో నిర్వహించిన తనిఖీలలో ఎటువంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న సుమారు 14 లక్షల 60 వేల రూపాయలను నగదును మరియు అక్రమంగా తరలిస్తున్న అధిక మొత్తంలో ( DPL & NDPL) 26 వేల మద్యం బాటిళ్ళను, 20 లీటర్ల నాటు సారాను స్వాదీనం చేసుకుని తరలిస్తున్న వారిపై కేసులు నమోదు చేయడం జరిగింది.
ఎన్నికల నేపధ్యంలో ఎన్.టి.ఆర్.పోలీస్ కమీషనరేట్ పరిదిలో గతంలో జరిగిన ఎన్నికలలో అల్లర్లుకు పాల్పడిన 787 మందిని, ఎన్నికలలో ఇబ్బందులకు గురిచేసిన 2023 మందిని, 373 మంది రౌడీషీటర్ లను, 490 మంది లా & ఆర్డర్ సస్పెక్ట్ లను, 890 మంది ఇతర చెడునడత కలిగిన వ్యక్తులను మొత్తం 4533 మందిపై 3776 కేసులు నమోదు చేసి, ఎటువంటి అసాంఘిక కార్యక్రామాలలో పాల్గోవడం చేయరాదని, ఎటువంటి కేసులలో ఇన్వాల్వ్ అవ్వకూడదని, ఎన్నికల నేపధ్యంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని, ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన, కేసులలో ఇన్వాల్వ్ అయిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరిస్తూ మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ వారి వద్ద బైండోవర్ చేయించడం జరిగింది.
ఈ నేపధ్యంలో ది.01.01.2024 తేది నుండి ఇప్పటి వరకు నిర్వహించిన తనిఖీలలో ఎటువంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న అక్రమ నగదు, మద్యం, ఓటర్లను ప్రలోభపెట్టే ఉచిత వస్తువుల వివరాలు:
సుమారు 07 కోట్ల 40 లక్షల రూపాయలను నగదును స్వాదీనం చేసుకుని 282 కేసులు నమోదు చేయడం జరిగింది.
సుమారు 05 కోట్ల 76 లక్షల రూపాయల విలువైన 08.58 కేజీల బంగారం మరియు 33.15 కేజీల వెండి ఆభరణాలు స్వాదీనం చేసుకుని 10 కేసులు నమోదు చేయడం జరిగింది.
రాష్ట్రంలో అక్రమంగా తరలిస్తున్న సుమారు ఒక కోటి 15 లక్షల రూపాయల విలువైన సుమారు 24 వేల లీటర్ల మద్యం బాటిళ్ళను స్వాదీనం చేసుకుని, 2146 మందిని అరెస్ట్ చేసి వారిపై 1847 కేసులు నమోదు చేయడం జరిగింది.
అదే విధంగా ఇతర రాష్ట్రాల నుండి అక్రమంగా తరలిస్తున్న సుమారు 91 లక్షల రూపాయల విలువైన సుమారు 12 వేల లీటర్ల మద్యం బాటిళ్ళను స్వాదీనం చేసుకుని 592 మందిని అరెస్ట్ చేసి వారిపై 521 కేసులు నమోదు చేయడం జరిగింది.
362 కేసులలో 85 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారు 43 లక్షల రూపాయల విలువైన సుమారు 28 వేల లీటర్ల నాటు సారాను స్వాదీనం చేసుకోవడంమరియు 40 లక్షల రూపాయల విలువైన సుమారు ఒక లక్షా 13 వేల లీటర్ల బెల్లపు ఊటను ద్వంసం చేయడం జరిగింది.
అక్రమంగా తరలిస్తున్న సుమారు 24 లక్షల రూపాయల విలువైన 510 కె.జి.ల గంజాయిని స్వాదీనం చేసుకుని 87 మందిని అరెస్ట్ చేసి వారిపై 52 కేసులు నమోదు చేయడం జరిగింది.
ఓటర్లను ప్రలోభపెట్టే ఉచిత వస్తువుల పంపిణి చేయుటకు తరలిస్తున్న సుమారు 5.5 లక్షల విలువైన వస్తువులను స్వాదీనం చేసుకుని కేసులు నమోదు చేయడం జరిగింది.
ఎన్నికల నియమావళి నిభంధనలను ఉల్లఘించిన వారిపై మోడల్ కోడ్ అఫ్ కాండక్ట్ క్రింద 75 కేసులు నమోదు చేసి వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవడం జరిగింది.