Home Andhra Pradesh 40వ రోజుకు చేరుకున్న ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం గుడివాడ రూరల్ మండలంలో పర్యటన

40వ రోజుకు చేరుకున్న ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం గుడివాడ రూరల్ మండలంలో పర్యటన

4
0

 40వ రోజుకు చేరుకున్న ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం గుడివాడ రూరల్ మండలంలో పర్యటన

కల్వపూడిఅగ్రహారం.పర్నాసగుంటాకోడూరు లింగవరం గ్రామాల్లో జననీరాజనాల మధ్య విస్తృత ప్రచారం చేసిన ఎమ్మెల్యే నాని

చంద్రబాబును నమ్మితే ప్రజలు మళ్లీ మోస పోతారు..సాధ్యం కానీ హామీలు మేనిఫెస్టోలో పెట్టిన అర్థం కూడా అదే

దేవుడి దయతో సీఎం జగన్ ప్రజలకు ఎంతో మంచి చేశారు.గతంలో ఎన్నడూ జరగని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి జరిగింది.

అక్క చెల్లెమ్మల ఖాతాల్లో….లంచాలు లేకుండా రెండు లక్షల 70 వేల కోట్ల రూపాయలు జమ చేశారు… వివక్షత లేకుండా వైసీపీ పాలన సాగింది

ప్రజలందరూ తమ రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుపై నొక్కాలి

గుడివాడ రూరల్ 06 : ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం 40వ రోజుకు చేరుకుంది. గుడివాడ రూరల్ మండలంలో సోమవారం ఎమ్మెల్యే కొడాలి నాని తన పర్యటన చేపట్టారు. మండలంలోని కల్వపూడి అగ్రహారం… పర్నాస… గుంటాకోడూరు…. లింగవరం గ్రామాల్లో ఎమ్మెల్యే నాని విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తమ గ్రామాలకు విచ్చేసిన ఎమ్మెల్యే కొడాలి నానికు పూల వర్షం కురిపిస్తూ గ్రామస్తులు అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. ప్రచారంలో భాగంగా గ్రామాల్లోని భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్… బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు ఎమ్మెల్యే కొడాలి నాని నివాళులర్పించారు. ప్రతి గ్రామంలో వందలాది మంది తరలివచ్చి ఎమ్మెల్యే కొడాలి నానిను తమ గ్రామాల్లో పూల వర్షంతో నడిపించారు. గ్రామాల వారీగా పర్యటనలు చేస్తూ సీఎం జగన్ కు మద్దతుగా నిలుస్తూ.. ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి గుడివాడ వైసీపీ ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని కోరారు. చంద్రబాబును నమ్మితే ప్రజలు మళ్లీ మోసం పోతారు.. నిద్రపోతున్న చంద్రముఖిని మళ్లీ నిద్రలేపినట్లు అవుతుంది.. చంద్రబాబును నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తలకాయ పెట్టడమే అంటూ ఎమ్మెల్యే కొడాలి నాని హెచ్చరించారు.

మరో వారం రోజుల్లో కురుక్షేత్ర సంగ్రామం జరగబోతోందని.. జరగబోయే ఎన్నికలు, ఎమ్మెల్యేలను ,ఎంపీలను, ఎన్నుకోవడానికి కాదు.. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కొనసాగింపు కోసం, ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. రాబోయే ఎన్నికల్లో మీరు వైసీపీకి ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగుతాయి.. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్ని ఆగిపోతాయని హెచ్చరించారు.. చంద్రబాబును నమ్మితే ప్రజలు మళ్ళీ మోసం పోతారు.. బాబు చరిత్ర చెప్పే సత్యం కూడా ఇదే.. సాధ్యం కానీ హామీలు మేనిఫెస్టోలో పెట్టిన అర్థం కూడా అదే… ఇది గుర్తుపెట్టుకుని ప్రజలు ఓటు వేయాలని కొడాలి నాని సూచించారు.దేవుడి దయతో సీఎం జగన్ ప్రజలకు ఎంతో మంచి చేశాడు.. గతంలో ఎన్నడూ జరగని విధంగా అభివృద్ధి చేశాడని కొడాలి నాని అన్నారు. సంక్షేమ పథకాలను మీ ఇంటికి చేర్చేలా సీఎం జగన్ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు.. అక్క చెల్లెమ్మల ఖాతాలో లంచాలు లేకుండా రెండు లక్షల 70 వేల కోట్ల రూపాయలు జమ చేశారు.. లంచాలు లేని ,వివక్ష లేని వైసీపీ పాలన సాగిందన్నారు.. నాడు, నేడు పథకం ద్వారా, ప్రభుత్వ పాఠశాలల తలరాతను మార్చరని.. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం విద్యకు నాంది పలికామని.. గోరుముద్ద, జగనన్న విద్యా దీవెన, అమ్మఒడి వంటి పథకాలతో, విద్యా వ్యవస్థలో విప్లవాలు తీసుకొచ్చింది సీఎం జగన్ ప్రభుత్వమేనని కొడాలి నాని అన్నారు.. గతంలో ఎప్పుడైనా ఇలాంటి పథకాలు అమలు జరిగాయా మీరే ఆలోచించండి అని సూచించారు. మహిళల జీవితాల్లో, ఆర్థిక స్వాలంబన తీసుకొచ్చాను అన్నారు సీఎం జగన్‌.. ఇంటి వద్దకే వచ్చే పాలన అందించారని… రైతుల కోసం రైతు భరోసా, ఉచిత పంటల భీమా ఇన్పుట్ సబ్సిడీలు, పగటిపూట తొమ్మిది గంటల నాణ్యమైన విద్యుత్ అందించారు.. ఇలా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఏపీని నిలబెట్టారని కొడాలి నాని పేర్కొన్నారు. కొడాలి నాని ఎన్నికల ప్రచారంలో కృష్ణాజిల్లా యువజన విభాగ అధ్యక్షుడు మెరుగుమాల కాళీ, గుడివాడ రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మట్టా జాన్ విక్టర్, గుడివాడ మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్ మట్ట నాగమణి జాన్ విక్టర్, జడ్పిటిసి గొళ్ల రామకృష్ణ, ఎంపీపీ గద్దె పుష్పరాణి, వైస్ ఎంపీపీ బట్టు నాగమల్లేశ్వరి, ఎంపీటీసీలు సింగవరపు ఝాన్సీ రాణి, గుడివాడ మండల సచివాలయాల కన్వీనర్ కారే జోసెఫ్, సర్పంచులు కాటూరి వెంకటేశ్వరమ్మ, గొర్ల రాజేష్ మేడేపల్లి ప్రభాకర్ రావు, ఇస్సా కృష్ణమూర్తి, వెలగలేటి రమ్య, వైస్ సర్పంచులు వరిగంజి పెద్దిరాజులు, గరికిపూడి జ్యోతి, దుంపల వెంకమ్మ, పల్లపోతు శ్రీనివాసరావు, *కల్వపూడి అగ్రహారం, పర్నాస, గుంటాకోడూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు* పిఎసిఎస్ అధ్యక్షులు ఏలేటి ఆంజనేయులు, మాజీ సర్పంచ్ ఎలిశేట్టి సరళ, ఎలిశెట్టి సుధాకర్, ఘంటసాల నాని, వరిగంజి నాగేంద్రం, తురక దాసు, మేడేపల్లి వాసు, కటారి దావీదు, కేత శివ, కుక్కల అశోక్ కుమార్, పల్లపోతు దుర్గరావు,, పల్లపోతు నాగ వెంకట దుర్గరావు, పల్లపోతు రంగారావు, పల్లపోతు సోమేశ్వరరావు, పల్లపోతు శ్రీను, పట్టెం సురేష్, గంట వీరయ్య, పట్టెం జోజి, గుండాబత్తుల నాని, పసల గోపి, పల్లపోతు జగన్, సచివాలయ కన్వీనర్ అంగడాల శివకుమార్, వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్ మేకల సత్యనారాయణ, బండి రాఘవ, గొరుముచ్చు జయరాజు, పోలిమెట్ల ధర్మ గాని, ఉందుర్తి రవిబాబు, అంగడాల వెంకటనారాయణ, వీర్ల రాము, మెరుగు మాల రాంబాబు, అంగడాల రామాంజనేయులు, బండి జాన్, బండి రవిబాబు, పులవర్తి చిన్నబాబు, పోలిమెట్ల నాని, పోలిమెట్ల చిన్ని, బాయిరెడ్డి విజయదశ కుమార్, బండి సురేష్, బండి మహేష్, తుమ్మపూడి కళ్యాణ్ బాబు, పోలిమెట్ల ధర్మరాజు, పోలిమెట్ల ధర్మ జ్ఞాని, పోలిమెట్ల నిమిషి, పోలిమెట్ల ఆకాష్, కొడమంచిలి సురేష్, కొడమంచిలి నవీన్, తుమ్మపూడి పవన్, మేకల రాము, మన్నె రమేష్, తిప్పర్నపల్లి దినేష్, తిప్పర్నపల్లి ప్రసాద్, దేవరపల్లి అనిల్, దేవరపల్లి సోమేశ్వరరావు, పోలిమెట్ల అనిల్ బాబు, *గుడివాడ నియోజకవర్గం లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు* మాజీ జడ్పిటిసి చిన్ని దుర్గాప్రసాద్, పిల్లి బెనర్జీ, సురపనేని కళ్యాణ్, కారే జోసెఫ్, కృష్ణాజిల్లా విద్యార్థి విభాగ అధ్యక్షుడు కళ్లేపల్లి పవన్, డొక్కు రాంబాబు, మేకల సత్యనారాయణ, మొండ్రు వెంకటేశ్వర రావు, లోయ రాజేష్, గుడివాడ ప్రభాకర్, గిరి బాబాయ్, కలపాల కిరణ్, తోట రాజేష్, ఘంటా సురేష్, నల్లమోతు జగదీష్, చుండూరి శేఖర్, క్రేన్ బాబి, అబ్దుల్ రజాక్, గుడ్లవల్లేరు మండల యువజన విభాగ అధ్యక్షుడు గుదే రవి, చుండి బావి, పుల్లేటికుర్తి కృష్ణ, నీరుడు ప్రసాద్, క్రేన్ బాబి, అబ్దుల్ రజాక్, కర్రే నాని, కర్రే చిన్ని, చింతాడి నాగూర్, ఘంటా శ్రీను,గుడివాడ టౌన్, రూరల్, గుడ్లవల్లేరు మండలాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అనుబంధ విభాగాల నాయకులు, కొడాలి నాని అభిమానులు, పెద్ద సంఖ్యలో ప్రజానీకం పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here