09-05-2024
బడుగు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ : ఎంపి అభ్యర్థి కేశినేని శివనాథ్
టిడిపిలో చేరిన ముదిరాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
వైసిపి వీడిన ముదిరాజ్ రాష్ట్ర కమిటీ సభ్యులు
200 మంది టిడిపి కండువా కప్పుకున్న ముదిరాజ్ లు
విజయవాడ : చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తే సమాధనం చెబుతాడు, సమస్యకి పరిష్కారం చూపిస్తాడు. తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం స్థాపించిన పార్టీ.. ముదిరాజ్ లకు ఏ సమస్యవచ్చినా అండదండగా వుంటానని విజయవాడ పార్లమెంట్ అభ్యర్ధి కేశినేని శివనాథ్ హామీ ఇచ్చారు. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో టిడిపి నాయకుడు, ఎన్టీఆర్ జిల్లా ముదిరాజ్ బిసి సాధికారక సమితి అధ్యక్షుడు దొంతాల బుచ్చిరామయ్య ఆధ్వర్యంలో వైసిపి నాయకుడు, ఆంధ్రప్రదేశ్ ముదిరాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చప్పిడి కృష్ణమోహన్ ముదిరాజ్ గురువారం కేశినేని శివనాథ్ సమక్షంలో టిడిపిలో చేరారు.
చప్పిడి కృష్ణమోహన్ కి మద్దతుగా ముదిరాజ్ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు మద్దుతగా నిలిచారు. . వీరిలో తిరువూరు నియోజకవర్గ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు రామినేని రామారావు, ముదిరాజ్ సంఘం కృష్ణ జిల్లా జనరల్ సెక్రటరి పిట్టు వెంకటరామయ్య, గుంజాల సుబ్బారావు, పిట్టు రమేష్, ముదిరాజ్ రాష్ట్ర నాయకులు మచ్చు జోగరావు, చప్పిడి సుదీర్, శ్రీకాంత్ చిట్టేటి, పద్మశాలి రాష్ట్ర సంఘం రాష్ట్ర నాయకులు పుట్ట విజయకుమార్ వున్నారు. వీరితో పాటు గా ముదిరాజ్ సంఘం సభ్యులు 200 మంది టిడిపి కండువా కప్పుకున్నారు.వీరందరికీ కేశినేని శివనాథ్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్బంగా కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ముదిరాజ్ రాష్ట్ర కార్యవర్గం అంతా టిడిపిలోకి చేరినందుకు అభినందనలు తెలుపుతూ ఆహ్వానం పలికారు. ఒక సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా మీకు జగన్ మాట్లాడేందుక అపాయింట్మెంట్ ఇవ్వకపోవటం దారుణమన్నారు. చంద్రబాబు అందరితో మాట్లాడతారు..వారి ఇబ్బందులు తెలుసుకుని ఆ సమస్యలను పరిష్కరిస్తారని చెప్పారు. తెలుగుదేశం పార్టీకి బిసిలే వెన్నుమూక అన్నారు. ముదిరాజ్ లకు ఏ సమస్య వచ్చినా అండగా వుంటానని,ఎన్నికల తర్వాత రాష్ట్ర కార్యవర్గం సమావేశం ఏర్పాటు చేస్తే వస్తానని మాట ఇచ్చారు. అక్కడ మీ సమస్యలు చేబితే చంద్రబాబు దృష్టికి తీసుకువెళతానని హామీ ఇచ్చారు. తాను చేయగలిగే పనులు తప్పక చేసి పెడతానన్నారు. ఎన్నికల రోజు మీ సంఘంలో అందరూ ఓటు వేసే విధంగా చూడాలని కోరారు.
అనంతరం ఆంధ్రప్రదేశ్ ముదిరాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చప్పిడి కృష్ణమోహన్ ముదిరాజ్ మాట్లాడుతూ వైసిపి వీడి టిడిపిలో చేరటంతో తనకి స్వేచ్చ వచ్చినట్లు గా వుందని తెలిపారు. వైసిపి పార్టీ లో ఒక అభిప్రాయం చెప్పటానికి లేదు. సోషల్ మీడియా నచ్చిన పోస్ట్ పెట్టడానికి వీల్లేదు నిర్భంధం పెరిగిపోయిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. వైసిపి వాడుకొని వదిలేసే రకమని విమర్శించారు. పని చేసే వాళ్లకి అక్కడ గుర్తింపు లేదు. అక్కడ పదవులు సూట్ కేసులు తెచ్చిన వారికే ఇస్తారని ఆరోపించారు. వైసిపి నాయకుల వైఖరికి విసిగిపోయి…రాష్ట్రాభివృద్దితో పాటు ముదిరాజ్ సామాజికవర్గం అభివృద్ది చంద్రబాబు నాయకత్వంలో జరుగుతుందనే నమ్మకంతో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు తెలియజేశారు. ఎన్డీయే కూటమి అభ్యర్ధుల గెలుపుకోసం కృషి చేస్తామన్నారు.