హిందూ దేవాలయాలభూముల్ని, వక్ఫ్ బోర్డ్ భూముల్ని కూటమి ప్రభుత్వం వేలం వేయకుండా లీజ్ ఇచ్చే హక్కు లేదు.
దేవుడు భూముల్ని అక్రమ పద్ధతిలో లీజ్ ఇచ్చి వేల కోట్ల రూపాయల డబ్బులు కొట్టేయడానికి లక్షల కోట్ల రూపాయల దేవుడు ఆస్తులు కొట్టేయడానికి పన్నుతున్న కుట్ర. కూటమి ప్రభుత్వ భూదోపిడి రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది. సామాన్యల భూముల్ని మాత్రమే కాదు దేవుళ్ళ భూములను కూడా కొల్లగొట్టేస్తున్నారు కనుకనే కూటమి ప్రభుత్వాన్ని భూ బకాసురుల ప్రభుత్వం అంటున్నారు. విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయ ప్రతిష్ట దిగజార్చి నిర్ణయాలను ఆలయ అధికారులు తీసుకోవద్దు. ఆలయాల్లో కాంట్రాక్టు అన్ని హిందువులకే ఇస్తామని చెప్పి కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో మాత్రం కాంట్రాక్ట్ లన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పిన అన్యమతస్తుతులకు కేటాయించడానికి తీవ్రంగావ్యతిరేకిస్తున్నాం. అమ్మవారి ఆలయంలోని అన్యమతస్తుల కేటాయించిన కాంటాక్ట్లను తక్షణమే రద్దు చేయాలి. ఆలయ పవిత్రతను కాపాడాలి లేదంటే అమ్మవారి భక్తులను హిందూ సమాజంతో కలిపి ఉద్యమిస్తాం. పోతిన వెంకట మహేష్ (విజయవాడ పశ్చిమ) గుంటూరు పార్లమెంట్ అబ్సర్వర్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.