కృష్ణలంక శంకర్ మఠం రోడ్డు కరెంట్ షాక్ తో ఘోరమైన ప్రమాదం భవన నిర్మాణ కార్మికుడు మృతి

Spread the love

 12-6-2024

కృష్ణలంక శంకర్ మఠం రోడ్డు కరెంట్ షాక్ తో ఘోరమైన ప్రమాదం భవన నిర్మాణ కార్మికుడు మృతి 

 మృతి చెందిన తర్వాత అంబులెన్స్ కూడా పిలవకుండా అతని రిక్షా బండి మీద తరలించింది బిల్లింగ్ యజమాని

విజయవాడ కృష్ణలంక శంకర మఠం రోడ్డు నూతనంగా భవన నిర్మాణం కడుతున్న నేపథ్యంలో కరెంట్ షాక్ తో మృతి కలకలం ప్రజల్లో ఒక ప్రాణం విలువ ఎన్ని లక్షలు కాపాడతాయా 

కనీసం భవన నిర్మాణకుడు రోజువారి కూలీ కరెంటు షాక్ తగిలి కింద పడిపోతే హాస్పటల్ వైద్యం కూడా అంబులెన్స్ పిలిపించకుండా మూడు చక్రాల ప్లాట్ఫారం బండి పై వెళ్తున్న దృశ్యం స్థానిక ప్రజలు మృతదేహాన్ని చూసి మనసు కలచివేత అయింది ఎంతో బాధకి గురయ్యారు

బిల్లింగ్ యజమాని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా భవన నిర్మాణకుడు చనిపోతే అతని ప్రయాణం డబ్బుతో వెలకట్టారు ప్రాణం విలువ

ఈ ఒక్క బిల్డింగు నిర్మాణం అన్ని బిల్డింగులు లోపలికి ఉంటే రోడ్డు లోపలికి 10 అడుగులు వెనక్కి ఈ బిల్డింగ్ ఒక నిర్మాణం రోడ్డు బయటికి వచ్చేసి కరెంటు తీగల ఆనుకొని నిర్మాణం జరుగుతుంది 

ఈ బిల్డింగ్ నిర్మాణం పై బిల్డింగ్ ఇన్స్పెక్టర్ ప్లానింగ్ సెక్రటరీ ఎంత ముడుపులు ముట్టడయింది ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ప్రజల పట్ల భవన నిర్మాణ ప్రాణాలకి ఏ రకమైన భద్రత లేదు 

బిల్డింగ్ ఇన్స్పెక్టర్ ప్లానింగ్ సెక్రటరీలు వాళ్లకి కావాల్సిందల్లా ముడుపులు మాకు ఎంత కొట్టావు నువ్వు బిల్డింగ్ కట్టుకో అన్నదే వాళ్ళకు కావాలి. దీనిని పట్టించుకుండే నాధుడే లేడు 

 ఒక పక్కన ప్రాణం పోతే దానిపై పైసలు సంపాదించుకుంటున్నారు అక్కడున్న స్థానిక ఒక కేబుల్ ఆపరేటర్ ఆమె జ్యోతి ఈమె వైసిపి నాయకురాలు ఈ ఒక సెటిల్మెంట్ జరిగింది

ఈ సెటిల్మెంట్లో కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ కూడా వెళ్లలేదు ఏరకంగా జ్యోతి సెటిల్మెంట్ చేసింది 

ఈ మృతి పై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అవ్వకుండా మృతదేహాన్ని తరలించారు దీనిపై స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు 

ఆ బిల్డింగ్ కు కరెంటు తీగలు దగ్గర ఉండడంతో కనీసం బిల్డింగ్ యజమాని కరెంట్ డిపార్ట్మెంటోళ్ళకు చెప్పి ఏదైతే ఆ కరెంటు తీగలు ఉన్నాయో ఆ తీగల కి పైపు కూడా తొలగించలేదు దీన్నిబట్టి బిల్లింగ్ యజమాని ఏ రకమైన జాగ్రత్త తీసుకుంటున్నాడు అర్థం అయిపోతుంది ఇంకా ఈ బిల్డింగ్లో ఎన్ని ప్రాణాలు పోతాయో

ఈ బిల్డింగ్ పనికిళ్లే భవన కార్మికులకి ఒకటే గుర్తుంచుకోవాలి మీరు పని చేసేటప్పుడు బిల్లింగ్ లో సరైన భద్రతలు ఉన్నాయా లేదా చూసుకొని పని చేసుకోండి లేతే మీ ప్రాణాలపై ఇలాంటి జ్యోతి మహిళా సెటిల్మెంట్ లో ఎన్ని లక్షలు ఇలాంటి ప్రాణాలపై ఆ మహిళ జేబులోకి ఎన్ని లక్షలు అవుతున్నాయో తస్మా జాగ్రత్త

ఇంకా ప్రభుత్వం మారిన రామ రాజ్యం వచ్చినా అరాచరాజ్యం పోలా 

ఇలాంటి పేదవాడి భవన నిర్మాణ కార్మికుడికి ఎవరు అండగా నిలబడతారు ఏ తల్లి కన్న బిడ్డ ఈ బిల్డింగ్ కి బలైపోయాడు 

ఈ బిల్డింగ్ పై స్పెషల్ ఎంక్వయిరీ చేసి దీనిని పరిశీలిచ్చి ఇక ఈ బిల్డింగ్ లో ఈ ఒక కార్మికుడు మృతి చెందకూడదని విజయవాడ కలెక్టర్ ఢిల్లీ రావు మున్సిపల్ కమిషనర్ పరిశీలించాలని అక్కడ స్థానికులు కోరుతున్నారు 

ఈ బిల్డింగ్ నిర్మాణం ఫస్ట్ నుంచి జరుగుతున్నంగానే ఏదో ఒక అలజడలు జరుగుతున్నాయని ఆ బిల్డింగ్ యజమాని అందరి మీద రుబాబుగా వ్యవహరిస్తున్నాడని ఏమనంటే పక్కనే ఉన్న కేబుల్ ఆపరేటర్ జ్యోతిని పిలుస్తూ రౌడీయిజం చేయిస్తున్నాడని అక్కడ స్థానికులు చెప్పడం జరిగింది. మా బిల్లింగ్ పైన ఏదైనా పడితే తగిన జాగ్రత్తలు తీసుకోవట్లేదు అలాగే ఇంకొక భవన నిర్మాణ కార్మికుడు ఇంకొక ఏదైనా జరిగితే పట్టించుకునే నాధుడే లేడని స్థానికల్లో ఆందోళన చెందుతున్నారు 

విజయవాడ పోలీస్ కమిషనర్ 

 సి హెచ్ రామకృష్ణ ప్రత్యేక దృష్టి పెట్టాలని ఈ భవన నిర్మాణకుడు మృతి పై కేసు నమోదు అవ్వలేదు

Channel 18 TV ఎడిటర్ జర్నలిస్ట్

మానేపల్లి మల్లికార్జునరావు

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *