సీఎం చంద్రబాబు నివాసంలో బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు విందు

Spread the love

 

అమరావతి

సీఎం చంద్రబాబు నివాసంలో బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు విందు

చంద్రబాబు నివాసానికి గురువారం సాయంత్రం విచ్చేసిన బీజేపీ ప్రజాప్రతినిధులు

ఎన్నికల్లో గెలిచిన బీజేపీ నేతలకు చంద్రబాబు అభినందనలు

విజయవాడలో బీజేపీ ప్రజాప్రతినిధుల అభినందనల ర్యాలీ

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు విచ్చేశారు. వీరికి సీఎం తన నివాసంలో గురువారం సాయంత్రం విందు ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందించారు. 

అంతకుముందు, విజయవాడలో బీజేపీ ప్రజాప్రతినిధుల అభినందన సభ జరిగింది. ఈ సభకు ముందు ర్యాలీ కూడా నిర్వహించారు. కాగా, ఈ సభలో కేంద్ర సహాయ మంత్రి, నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాసవర్మ, ఏపీ బీజేపీ చీఫ్, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ తదితరులు హాజరయ్యారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *