Home Political news రాజ‌కీయ స‌న్యాసమా క్ష‌మాప‌ణాలా కొడాలి నాని తెల్చుకో టి.ఎన్.ఎస్.ఎఫ్ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి...

రాజ‌కీయ స‌న్యాసమా క్ష‌మాప‌ణాలా కొడాలి నాని తెల్చుకో టి.ఎన్.ఎస్.ఎఫ్ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి పొట్లూరి ద‌ర్షిత్

5
0

 * 22-06-2024 

రాజ‌కీయ స‌న్యాసమా క్ష‌మాప‌ణాలా 

కొడాలి నాని తెల్చుకో టి.ఎన్.ఎస్.ఎఫ్ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి పొట్లూరి ద‌ర్షిత్

విజ‌య‌వాడ : చంద్రబాబు నాయుడు కుప్పంలో గెలిచినా, జగన్మోహన్ రెడ్డి ని అధికారం నుంచి దించిన శాశ్వతంగా రాజకీయ సన్యాసం చేస్తానని స‌వాల్ చేసిన కొడాలి నాని మాట మీద నిల‌బ‌డాల‌ని టి.ఎన్.ఎస్.ఎఫ్ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి పొట్లూరి ద‌ర్షిత్ డిమాండ్ చేశారు. ఇటీవ‌ల మాజీ మంత్రి కొడాలి నాని మీడియా ముందు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు పై చేసిన అనుచిత వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తూ గురునాన‌క్ కాల‌నీ లోని విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కార్యాయ‌లం, ఎన్టీఆర్ భ‌వ‌న్ లో శనివారం మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. స‌వాల్ విసిరిన కొడాలి నాని మాట మీద నిల‌బ‌డి రాజ‌కీయ స‌న్యాసం చేసి, రాష్ట్రం విడిచిపోవాలి లేదంటే క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌న్నారు. ఈ రెండు ఆప్ష‌న్స్ లో ఏదోక‌టి తెల్చుకోవాల‌ని హెచ్చ‌రించారు. 

అటు స‌వాల్ లో, ఇటు ఎమ్మెల్యేగా ఓడిపోయిన కొడాలి నానికి ఇప్పుడు మీడియా ముందుకు వ‌చ్చి మాట్లాడే హ‌క్కు లేద‌ని పేర్కొన్నారు. కొడాలి నానికి టిడిపి హామీలు గురించి ప్రశ్నించే హ‌క్కు,అర్హ‌త‌ రెండు లేవ‌న్నారు. ఎమ్మెల్యేగా ఓడిపోయిన‌ కొడాలి నాని కి ఏమైనా స‌మ‌స్య‌లు ఉంటే, గుడివాడ‌ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము వద్ద అర్జీ పెట్టుకోవాల‌ని సూచించారు. ప్ర‌తిప‌క్ష హోదా కూడా రాని పులివెందుల ఎమ్మెల్యే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కి ఏమైనా స‌మ‌స్య‌లు వుంటే సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుకి ఆర్జీ పెట్టుకుంటే ప‌రిశీలిస్తార‌ని తెలిపారు. 

వైసిపి నాయ‌కులు దాడులు చేశార‌ని మాట్లాడం చూస్తే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుగా వుంద‌న్నారు.. గతంలో అనేకసార్లు వైసిపి నాయకులు టిడిపి కార్యకర్తలపై దాడులు చేశారు..వాటిని అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏనాడు ఖండించలేదు., పైగా జగన్మోహన్ రెడ్డి ఆ దాడులు పై స్పందిస్తూ వైసిపి అభిమానులకు బిపి రావడం సహజమే అన్నాడు… ఓ ముఖ్య‌మంత్రి హోదాలో వుండి ఆ విధంగా స‌మ‌ర్థించుకోవ‌టం ఆయ‌న‌కే చెల్లింద‌ని మండిప‌డ్డారు. ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు ఏనాడు టిడిపి కార్య‌క‌ర్త‌ల‌ను రెచ్చ‌కొట్టే విధంగా మాట్లాడ‌లేదు, ప్రోత్స‌హించ‌లేద‌న్న విష‌యం గ్ర‌హించాల‌న్నారు. త‌ప్పు జ‌రిగితే నిందితుల్ని శిక్షించే విష‌యంలో సీఎం చంద్ర‌బాబు నిష్పాక్ష‌పాతంగా వ్య‌వ‌హ‌రిస్తార‌ని తెలిపారు. 

మాట త‌ప్ప‌టం మ‌డ‌మ తిప్ప‌టం జ‌గ‌న్ తో పాటు వైసిపి నాయ‌కుల‌కి బాగా అల‌వాటుగా మారిపోయింద‌న్నారు. అధికారంలో వున్న‌ప్పుడు రిషికొండ ప్యాలెస్ జ‌గ‌న్ నివాసం వుండ‌టానికి అని చెప్పి..ఇప్పుడేమో టూరిజం కోసం క‌ట్టించామ‌ని కొడాలి నాని చెప్పుకోవ‌టం చూస్తే..ప్ర‌జ‌ల‌కి వాళ్ల‌ మోస‌పూరిత ఆలోచ‌న‌లు అర్ధ‌మవుతున్నాయ‌న్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here