* 22-06-2024
టిడిపి ఎంపీలకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి లోకేష్
టిడిపి సమావేశానికి హాజరైన కేశినేని శివనాథ్ చిన్ని
విజయవాడ : పార్లమెంట్ సమావేశాలకు హాజరు కానున్న టిడిపి ఎంపిలందరికి మంత్రి లోకేష్ శుభాకాంక్షలు తెలియజేశారు. పార్లమెంట్లో అనుసరించాల్సిన విధివిధానాలపై సలహాలు, సూచనలు అందించారు. మంగళగిరిలోని తెలుగు దేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో శనివారం టిడిపిపి సమావేశం జరిగింది.ఈ సమావేశానికి మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. ఈ సందర్బంగా కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ తో పాటు గా విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ మంత్రి లోకేష్ కలిసి మాట్లాడారు. అనంతరం ఎంపిలందరూ మంత్రి లోకేష్ ను ఘనంగా సన్మానించారు.