కాపు విద్య విజ్ఞాన అభివృద్ధి సంఘం కళ్యాణ మండపం నందు అధ్యక్షులు కోన శ్రీహరి ఆధ్వర్యంలో తూర్పుకాపు సంఘ ఆత్మీయ సమావేశం

Spread the love

 ది:23-6-2024 ఆదివారం  ఉదయం 11:00″గం లకు” సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని గులాబీ తోట 27 డివిజన్ లో తూర్పు కాపు విద్య విజ్ఞాన అభివృద్ధి సంఘం కళ్యాణ మండపం నందు అధ్యక్షులు కోన శ్రీహరి ఆధ్వర్యంలో తూర్పుకాపు సంఘ ఆత్మీయ సమావేశం

నిర్వహించుకోవడం జరిగినది

ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు,టిడిపి పొలిట్ బ్యూరోసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు పాల్గొనడం జరిగినది

ఈ సందర్భంగా బొండా ఉమ మాట్లాడుతూ;-కులమతాలు అనే తారతమ్యం లేకుండా అందరం కలిసి మెలిసి ఉండాలి అని,గతంలో తాను 75 లక్షల రూపాయలు నిధులతో 2 కాపు కళ్యాణమండపాలు ఒకటి స్వర్గీయ వంగవీటి మోహన రంగా పేరు మీద,మరొకటిమంజూరు చేపించడం జరిగింది అని,దాసరి కనకరావు రావు పేరుమీద అని,అటువంటిది 2019 లో అధికారంలోకి వచ్చిన వైసీపీ వాటికి అభివృద్ధి చేయక వదిలేసింది అని

ఇపుడు తెలుగుదేశం ప్రభుత్వం లో కాపు కార్పొరేషన్ ని అభివృద్ధి చేస్తాం అని,అలాగే ప్రభుత్వం తరపున అన్నిరకాలుగా అండగా ఉంటాం అని,ఎవరికి ఏ అవసరం వచ్చిన తాను అండగా ఉంటాను అని..

ఈ కళ్యాణ మండపానికిసంబంధించి పూర్తిగా పర్మిషన్లు గవర్నమెంట్ సైడ్ నుంచి అన్ని రకాల సపోర్ట్ చేస్తామని సంఘ నాయకులు కి సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు హామీ ఇవ్వడం జరిగింది

ఈ కార్యక్రమంలో;-మాజీ అధ్యక్షులు కునుకు రాజశేఖర్, ఇప్పిలి రామ్ మోహన్,టిడిపి రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, కర్ణం రమణ, వీరమాచినేని కిషోర్, పిన్నింటి శీను, నియోజకవర్గ తూర్పు కాపు కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు 

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *