యార్లగడ్డ ఆదేశాల మేరకు డ్రైన్లపూడిక తీత పనులు ప్రారంభం గన్నవరం :
గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆదేశాల మేరకు గన్నవరంలో డ్రైనేజీల పూడికతీత పనులు ప్రారంభమయ్యాయి. వర్షాకాలం ప్రారంభం కావటంతో గ్రామాల్లోని డ్రైనేజీల పూడిక తీసి శుభ్రం చేయాలని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అధికారులు ఆదేశించారు. ఈ మేరకు గ్రామపంచాయతీ నిధులతో గన్నవరంలో డ్రైనేజీ పనులను ఈ నెల రెండో వారంలో పాటి దిబ్బల వద్ద ఎమ్మెల్యే వెంకట్రావ్ ప్రారంభించారు. వివిధ కారణలతో ఈ పనుల్లో జాప్యం జరుగ్గా ఈ సమస్య ఎమ్మెల్యే దృష్టికి వెళ్ళింది. వెంటనే స్పందించిన యార్లగడ్డ డ్రైనేజీ పనుల్లో జాప్యం జరగటంపై సంబంధిత అధికారులను ప్రశ్నించిన ఆయన తక్షణమే పనులు చేపట్టాలని పంచాయతీ ఈఓ ని ఆదేశించారు. దీంతో శుక్రవారం ఉదయం నుంచి జాతీయ రహదారి పై డ్రైనేజీల్లో సిల్టు తీసి శుభ్రం చేసే పనిని గ్రామపంచాయతీ అధికారులు యుద్ధ ప్రాతిపదికను చేపట్టారు. గన్నవరంలోని ప్రధాన డ్రైన్ లతోపాటు అంతర్గత రహదారూల్లోని డ్రైనేజీలలో పూడిక తీసి మురుగునీరు సక్రమంగా పారేలా చర్యలు తీసుకుంటామని పంచాయతీ అధికారులు తెలిపారు.