వారాహి అమ్మవారి ఆరాధనతో దీక్షకు శ్రీకారం
అమరావతి:- రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారాహి దీక్షకు మంగళవారం శ్రీకారం చుట్టారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉదయాన్నే వారాహి అమ్మవారి ఆరాధనతో దీక్ష ప్రారంభించారు. వేద పండితులు మంత్రోచ్ఛారణల నడుమ అమ్మవారికి ప్రత్యేక అర్చనలు చేశారు. సంధ్యాసమయంలోను వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 11 రోజులపాటు వారాహి దీక్షలో ఉంటారు