ఘనంగా ఇబ్రహీంపట్నం ప్రెస్ క్లబ్ నాల్గవ వార్షికోత్సవం
వార్షికోత్సవ వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే కృష్ణప్రసాదు
ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం, 26.06.2024
ఇబ్రహీంపట్నం ప్రెస్ క్లబ్ నాల్గవ వార్షికోత్సవ వేడుకలను మీడియా సోదరులు బుధవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కేకులు కట్ చేసి, మీడియా సోదరులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా మీడియా సోదరులు అంకితభావంతో పని చేస్తున్నారని వారి సంక్షేమానికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని పేర్కొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ప్రెస్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.