జీవితంలో ఏదైనా సాధించాలి అనుకునే వాళ్లకి రామోజీరావు జీవితాన్ని మించిన పాఠ్యాంశం ఏ బిజినెస్ స్కూల్లోనూ, ఏ
విద్యా, ఐటీ శాఖ మంత్రి
నారా లోకేష్,
యూనివర్సిటీలోనూ దొరకదు. శ్రమయేవ జయతే అనే పదానికి పర్యాయపదం. విశ్వసనీయతకు విశ్వరూపం రామోజీరావు .
ఎదిగే కొద్దీ ఒదిగి ఉండటం అనే పదానికి మానవరూపం కల్పిస్తే అది రామోజీరావు . సంపూర్ణ మానవుడికి ఉండాల్సిన విశిష్ట లక్షణాలు అనేకం రామోజీరావు లో ఉన్నాయి. ఒకప్పుడు మీడియాలో ఏదైనా వార్త వస్తే నిజం అనుకునే వాళ్లు. ఇప్పుడు “నిజమా..?” అనుకుంటున్నారు. ఇలాంటి రోజుల్లో కూడా ఈనాడు – ఈటీవీలో ఒక వార్త వచ్చిందంటే అది నిజమే అని జనం నమ్ముతున్నారంటే అదీ రామోజీరావు కి ఉన్న క్రెడిబులిటీ. ఈ ప్రపంచంలో డబ్బుంటే దేనినైనా కొనుక్కోవచ్చు. ఒక్క క్రెడిబులిటీని తప్ప. అది అమెజాన్లో ఆర్డర్ ఇస్తే దొరికే వస్తువు కాదు.
విశ్వసనీయత అనేది ఒక్కో ఇటుక పేర్చి నిర్మించుకునే సౌథం లాంటిది. కాలం దానికి ప్రతి రోజూ అనేక పరీక్షలు పెడుతుంది. వాటిని తట్టుకుని క్రెడిబులిటీని కాపాడుకోవటం ఒక పెద్ద ఛాలెంజ్.
రామోజీరావు తన 62 ఏళ్ల వ్యాపార సామ్రాజ్యంలో వెనకేసుకుంది ఏదైనా ఉంది అంటే అది… విశ్వసనీయతే. దానిని మించిన సంపద లేదు. కేవలం కోటికి ఒకరికి మాత్రమే అది సాధ్యం. దేశంలో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి చాలా డెలికేట్గా ఉంటాయి. ఏ చిన్న అనధికార వార్త వచ్చినా అవి వణికిపోతాయి. జనం మీద పడిపోతారు. అవి నేషనల్ బాంక్స్ కానీ ప్రైవేట్ ఇనిస్టిట్యూషన్స్ అయినా సరే. కానీ రామోజీరావు మార్గదర్శి మాత్రం అందుకు మినహాయింపు. గత పాలకుడు, ప్రభుత్వం మార్గదర్శి మీద ఆరోపణలు చేసి, ఫిర్యాదులు చేసి, ప్రజల సొమ్ములకు గ్యారంటీ లేదు, ఈ సంస్థను నమ్మకండి అని పేపర్లో అడ్వర్టయిజ్మెంట్లు ఇచ్చింది. అయినా ఒక్కరంటే ఒక్క కస్టమర్ కూడా మార్గదర్శీని అనుమానించలేదు అంటే అదీ రామోజీరావు క్రెడిబులిటీ అంటే. కొంతమంది ఎన్ని జన్మలెత్తినా అలాంటి విశ్వసనీయతను పొందలేరు.
కొంతమంది మీడియా సంస్థలు పెట్టి వివిధ పార్టీల వద్ద రాజ్యసభ వంటి పదవులు తీసుకున్నవాళ్లు ఉన్నారు. కానీ రామోజీరావు ఏనాడు వాటిని ఆశించలేదు. నిజానికి వచ్చిన అవకాశాలను కూడా తిరస్కరించారు. ఎలాంటి ప్రతిఫలాపేక్షా లేకుండా సేవ చేశారు. సృజనాత్మకత, కొత్తగా ఆలోచించటం అనేవి రామోజీరావు లో ఉన్న విశిష్ట లక్షణాలు. అవే ఆయన వ్యాపార సంస్థల సక్సెస్కు కారణం. అందుకే రామోజీరావు అంటే ప్రతి తెలుగువాడు తమ కుటుంబ పెద్దగా భావిస్తారు. ఒక సెక్షన్ ఆఫ్ మీడియా రామోజీరావు మీద ప్రతిరోజూ బురద చల్లుతున్నా ఏరోజూ కూడా ఆయన వాటికి కౌంటర్ ఇవ్వలేదు. కనీసం ప్రతిస్పందించలేదు. కారణం ఏంటంటే… ఆయన తనపై వచ్చే విమర్శలను పట్టించుకోరు. కేవలం తన కర్తవ్యం మీద మాత్రమే వారు దృష్టి పెడతారు. అందుకే ఆయన గ్రేట్ హ్యూమన్ బీయింగ్గా నిలిచారు. కొండల్లో గుట్టల్లో భూతలస్వర్గం లాంటి రామోజీ ఫిలింసిటీని నిర్మించాలి అనే ఆయన ఆలోచనే ఒక సాహసం. ఆయను గొప్ప విజనరీ.
తెలుగుభాషకు పట్టం కట్టి, పట్టాభిషేకం చేసిన భాషా ప్రేమికుడు. తెలుగుజాతి ఘనకీర్తి శాశ్వతంగా నిలిచిపోయేలా ఆంధ్రుల రాజధానికి అమరావతిగా నామకరణం చేసిన చరితార్థుడు రామోజీరావు .
సద్విమర్శలను స్వీకరించటం, నిరాడంబరంగా ఉండటం, నిత్య విద్యార్థిలాగా నిరంతరం కొత్త విషయాలను తెలుసుకోవటానికి ఆసక్తి చూపటం ఇవన్నీ ఆయనలో ఉండే గ్రేట్ క్వాలిటీస్. 1975లో ఎమర్జన్సీ నుంచి జగన్ పాలన వరకు ఆయన అధికారంలో ఉన్న వాళ్లు తప్పు చేసినప్పుడు, ప్రజల హక్కులను కాలరాచినప్పుడు ధైర్యంగా ఎదురుతిరిగారు. ప్రజల తరపున ప్రశ్నించారు. ఆ క్రమంలో వ్యక్తిగతంగా ఎంత నష్టం వాటిల్లినా ఆయన లెక్క చేయలేదు. అదీ ఆయనకు ప్రజల పట్ల ఉన్న కృతజ్ఞతా భావం. రామోజీరావు భౌతికంగా మన మధ్య లేకపోయినా అక్షరం రూపంలో ఎప్పుడూ మన మధ్యనే
ఉంటారు
.విద్యా, ఐటీ శాఖ మంత్రి.
నారా లోకేష్,