15-5-2025
తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత తాను శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయల పైబడి అభివృద్ధి పనులు చేపట్టాం
ధి:-30-5-2025 శుక్రవారం ఉదయం 9:30″ గం లకు ” సెంట్రల్ నియోజకవర్గంలోని 30వ డివిజన్ దావు బుచ్చి కాలనీ లో దీర్ఘకాలంగా పరిష్కారానికి నోచుకోని 6 వ వీధి , జివిఆర్ నగర్, వినాయక నగర్ జీరో లైన్లకు ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు శంకుస్థాపన చేసి బీటీ రోడ్డు పనులను ప్రారంభించడం జరిగిందిఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి, మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు, ఆ క్రమంలోనే నియోజకవర్గంలో ప్రధాన సమస్యలుగా ఉన్న అంతర్గత రోడ్లు, దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న రోడ్లు,(ROB), RUB ల నిర్మాణంపై దృష్టి సాధించామన్నారు2009లో మొదలుపెట్టిన గుణదల ROB నిర్మాణ పనులను టిడిపి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని పూర్తిచేస్తుందని, గుణదల లోనే మరొకవైపున ఆర్ఓబి నిర్మాణంకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, మధుర నగర్ పప్పుల మిల్లు సెంటర్లో ఆర్ యు బి నిర్మాణం చేస్తామన్నారు…ఈరోజు దావూ బుచ్చి కాలనీలో 48.98 లక్షలు వ్యయంతో విఎంసి సాధారణ నిధుల ద్వారా రోడ్లు వేయిస్తున్నామని సుదీర్ఘకాలం పెండింగ్ లో ఉన్న దావు బుచ్చి కాలనీ 6 రోడ్డు, జివిఆర్ నగర్ జీరో లైన్, వినాయక నగర్ జీరో లైన్ల రోడ్లను శంకుస్థాపన చేస్తున్నామని త్వరలో మొదలుపెట్టి యుద్ధ ప్రాతిపదికను పూర్తిచేసి ప్రజలకు అందిస్తామని తెలియజేశారు. పెరిగిన ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా అజిత్ సింగ్ నగర్ ఫ్లైఓవర్ కు అనుసంధానంగా మరొక ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగిందని, త్వరలోనే ఆ పనులు సైతం మొదలవుతాయి అని, నియోజకవర్గంలో ప్రతి డివిజన్ లోను ప్రజా సమస్యలపై సంపూర్ణ అవగాహన తనకు ఉందని ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఇప్పటికే నియోజకవర్గంలో సుమారుగా 200 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, కొన్ని పనులు ఇప్పటికే పూర్తయినట్లు బొండా ఉమ తెలియజేశారు2024 లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక, నిరంతరం అభివృద్ధి చేసే ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండదండలతో వివిధ డివిజన్ లా లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అనేక అభివృద్ధి పనులు చేస్తున్నట్లు, ఆ క్రమంలో సెంట్రల్ నియోజకవర్గంలో కోట్ల రూపాయల వ్యయంతో రహదారి నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తున్నట్లు తెలియజేశారు… ఈ కార్యక్రమంలో:- 30 అడుగుల అధ్యక్షులు లక్కం రాజు శ్రీనివాసరాజు, కార్యదర్శి వీరభద్రం, ఇన్చార్జి కరణం వెంకటరమణ లోటస్ ల్యాండ్ మార్క్ పెద్దలు, స్థానిక తాగు బుజ్జి కాలనీ పెద్దలు, ఓటమి నాయకులు పాల్గొన్నారు