భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు మిట్ట వంశి క్రిష్ణ పిలుపుమేరకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురంజేశ్వరి సూచనలతో
మరియు జిల్లా అధ్యక్షులు అడ్డురి శ్రీరామ్ సూచనలతో భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో ఏదైతే మొన్న జరిగిన పార్లమెంటు సమావేశాల్లో కాంగ్రెస్ కూటమి నాయకుడు రాహుల్ గాంధీ హిందువుల పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఈ రోజు ఉదయం 11:30 గంటలకు బిజెపి జిల్లా ఆఫీస్ కార్యాలయం నుండి విజయటాకీసు సెంటర్ వరకు ర్యాలి నిర్వహించి, తదనంతరం రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను దగ్దంచేసి , ఏలూరు రోడ్ లో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారతీయజనతాపార్టీ రాష్ట్ర నాయకులు,జిల్లా నాయకులు మరియు మండల అధ్యక్షులు,బిజెపి కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసారు.