ఈ రోజు ఉదయం 5-7-24 52 వ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు (చంటి) డివిజన్ పర్యటన చేసి శుభోదయం ప్రజా దర్బార్* నిర్వహించి స్థానికుల సమస్యలను
అడగగా వారు త్రాగునీటి సమస్య ఒక్క పూట మాత్రమే వస్తుందని,కొండప్రాంతం పాములు వస్తున్నాయని, చెట్లు బాగ పెరిగినియ్యని వాటిని కొట్టించవలేనని,కొండ పైభాగానికి నీరు రావటం లేదు అని,పైపులు లీకులు అవుతున్నాయని,మెట్ల మార్గం సరిగ్గా లేదని బాగుచేపించ వలెనని, కుక్కలు బెడద ఎక్కువగా ఉన్నదని, సీసీ కెమెరాలు ఏర్పాటు గురించి, కాలువాల మరమత్తులు చెపించవలేనని,చెత్త తీసుకువెళ్ళే మున్సిపల్ సిబ్బంది రోజు రావటం లేదు అని, కొత్త పెన్షన్లు రాపించమని స్థానికులు కోరడం జరిగింది.కార్పొరేటర్ చంటి సమస్యలన్నీ MLA ,MP దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.అదేవిధంగా మురుగు నీరు నిల్వ ఉండడం వలన దోమలు వృద్ధి చెందుతాయని అందువలన మురుగునీరు నిలవ లేకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని దోమలు లేని నగరంగా చేసుకోవాలని, వ్యర్థ పదార్థాలు టబ్ లో వేసి కార్పొరేషన్ సిబ్బందికి ఇవ్వవలెనని, కాలువలో చెత్త వెయ్యరాదని ప్రజలను కోరడం జరిగింది.