Home Political news అసెంబ్లీ మీడియా కమిటీలో ఎపిఎంఎఫ్ కు ప్రాతినిధ్యం కల్పించాలి స్పీకర్ అయ్యన్నపాత్రుడికి ఢిల్లీబాబురెడ్డి వినతి

అసెంబ్లీ మీడియా కమిటీలో ఎపిఎంఎఫ్ కు ప్రాతినిధ్యం కల్పించాలి స్పీకర్ అయ్యన్నపాత్రుడికి ఢిల్లీబాబురెడ్డి వినతి

4
0

 అసెంబ్లీ మీడియా కమిటీలో ఎపిఎంఎఫ్ కు ప్రాతినిధ్యం కల్పించాలి

స్పీకర్ అయ్యన్నపాత్రుడికి ఢిల్లీబాబురెడ్డి వినతి

అమరావతి, జూలై5: ఆంధ్రప్రదేశ్ శాసనసభ మీడియా అడ్వయిజరీ కమిటీలో ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ (ఎపిఎంఎఫ్)కు ప్రాతినిధ్యం కల్పించాలని ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి పి. ఢిల్లీబాబురెడ్డి శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడికి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం నాడు ఢిల్లీబాబురెడ్డి సారధ్యంలోని ఎపిఎంఎఫ్ ప్రతినిధి బృందం అసెంబ్లీ ఛాంబరులో స్పీకర్ అయ్యన్నపాత్రుడిని మర్యాదపూర్వకంగా కలిశారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడికి పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడికి ఎపిఎంఎఫ్ తరపున వినతిపత్రం అందజేశారు. ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, న్యూస్ ఏజన్సీస్, వెబ్ మీడియా, స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ తరపున రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం, హక్కుల సాధన కోసం కీలకపాత్ర పోషిస్తున్న విషయాన్ని స్పీకర్ అయ్యన్నపాత్రుడికి ఢిల్లీబాబురెడ్డి వివరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎపిఎంఎఫ్ ను రికగ్నైజ్ చేయడంతో జర్నలిస్టుల వృత్తిపరమైన అన్ని కమిటీలలో కూడా ప్రాతినిధ్యం కల్పించిందని ఆయన వివరించారు. గత ప్రభుత్వం ఎపిఎంఎఫ్ పట్ల సవతితల్లి ప్రేమను ప్రదర్శించి అసెంబ్లీ మీడియా అడ్వయిజరీ కమిటీలో స్థానం ఇవ్వలేదని స్పీకర్ దృష్టికి తీసుకువచ్చారు. భవిష్యత్తులో నియమించే అసెంబ్లీ మీడియా అడ్వయిజరీ కమిటీలో ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ (ఎపిఎంఎఫ్)కు ప్రాతినిధ్యం కల్పించాలని ఢిల్లీబాబు రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రతినిధి బృందంలో ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ జాతీయ ఉపాధ్యక్షులు చెల్లుబోయిన శ్రీనివాస్, ఎపిఎంఎఫ్ నాయకులు ఐ. వెంకట్రామరాజు, ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్‌ ( ఐ.జే .యు) ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు వల్లూరు ప్రసాద్ కుమార్,,పీతల అప్పాజీ కిరణ్ కుమార్ తదితరులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here