విజయవాడ
టి.డి.ఆర్ బాండ్ల కంభకోణంలో జగన్ ను అరెస్టు చేయాలి.. టీడీపీ నేత బుద్దా వెంకన్న
టి.డి.ఆర్ బాండ్ల కుంభకోణంలో జగన్ సూత్రధారి
కారుమూరి నాగేశ్వరరావు సారధ్యంలో కోట్లు దోపిడీ
తిరుపతిలో భూమన కరుణాకరరెడ్డి సారధ్యంలో మరో దోపిడీ
మురికి వాడలో రోడ్లు వేసే పేరుతో 36 కోట్లు పేరుతో 700 కోట్లు దోచుకున్నారు
రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో ఈ దోపిడీ జరిగిందనేది వాస్తవం
జగన్ ఆదేశాలు లేకుండా ఎమ్మెల్యేలు ఇంత దోపిడీ చేయలేరు
కారుమూరి నాగేశ్వరరావు, కరుణాకరరెడ్డి, కొట్టు సత్యనారాయణ, మూర్తిలను విచారిస్తే వాస్తవాలు బయటకు వస్తాయి
ఈ కుంభకోణాలపై పోరాటం చేయాల్సిన బాధ్యత మాపై ఉంది
జగన్ ప్రభుత్వంలో చేసిన అవకతవకలపై విచారణ చేయాలి
ప్రభుత్వ ఆదాయలకు గండి కొట్టి.. వారి సొంత ఖజానాలను నింపుకున్నారు
ఈ కుంభకోణాలపై సీఐడీ కి ఫిర్యాదు చేస్తున్నాం
జగన్ తో పాటు, పలువురు ఎమ్మెల్యేలు, అక్కడ పని చేసిన అధికారులను సీఐడీ విచారించాలి
జగన్ ను వెంటనే కస్టడీలోకి తీసుకుని విచారణ చేస్తే నిజాలు బయటకు వస్తాయి
బాండ్ల పేరుతో ప్రభుత్వ ఖజానాకే గండి కొట్టారు
ఇప్పటి వరకు రెండు వేల కోట్ల కుంభకోణం జరిగినట్లు మా దృష్టికి వచ్చింది
విచారణ చేస్తే… ఇంకా ఎన్ని వేల కోట్లు దోచుకున్నారో తెలుస్తుంది
ఈ వివరాలతో ఎల్లుండు సీఐడీ కి పిర్యాదు చేసిన తర్వాత లైతన విచారణ చేయాలని కోరుతున్నాం
తిరుపతిలో 500, కడపలో 700కోట్లు, తాడేపల్లి గూడెం, విశాఖలో కూడా దోపిడీ జరిగింది
నిజాయతీ ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది కాబట్టే.. వారి దోపిడీ బయట పడింది
ప్రభుత్వం వాల్యూ కట్టాలంటే.. కలెక్టర్లకు పాలకులే ఆదేశాలు ఇవ్వాలి
ముఖ్యమంత్రి గా పని చేసిన జగన్ కనుసన్నల్లోనే ఇదంతా జరిగింది
తనకు సన్నిహితంగా ఉన్న వారికి మాత్రమే ఇవి దోచిపెట్టారు
ఈ వ్యవహారం మొత్తం తేలే వరకు నా పోరాటం కొనసాగుతుంది
ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ .. తెలుగు ప్రజలకు మేలు చేస్తుంది
జగన్ కు ఎన్నికల సమయంలో కేసీఆర్ డబ్బులు పంపించాడు..
కానీ రాష్ట్రం కోసం ఎప్పుడూ ఇద్దరూ కూర్చుని చర్చలు చేయలేదు
చంద్రబాబు మాత్రం రాష్ట్ర ప్రజల కోసం మంత్రులతో, అధికారులతో కమిటీలు వేశారు.
జగన్ ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి నాశనం చేశాడు
ఇసుక, మైనింగ్, మద్యం ద్వారా దోచుకున్న వేల కోట్లు జగన్ నేలమాళిగల్లో ఉన్నాయి.