దివంగత మహానేత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 75 వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న రాష్ట్ర మాజీ మంత్రివర్యులు మరియు పెనమలూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త జోగి రమేష్
వైసీపీ కేంద్ర కార్యాలయం,
తాడేపల్లి,
08.07.2024
*ఈ రోజు దివంగత మహానేత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి కార్యక్రమాల్లో భాగంగా తాడేపల్లి లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉత్సవాల్లో పాల్గొని ఆ మహనీయునికి ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రివర్యులు మరియు పెనమలూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త జోగి రమేష్ .*
*ఈ సంధర్భంగా జోగి రమేష్ మాట్లాడుతూ దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి కి మరణం అనేది లేదని, వారు చూపిన బాటలో మాట తప్పక మడమ తిప్పకుండా ప్రజల పక్షాన తమ పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు.*
ఈ జయంతి ఉత్సవాల్లో పలువురు రాష్ర్ట పార్టీ ప్రముఖులు ప్రజాప్రతినిధులు నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు