ఇంద్రకీలాద్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక మరియు ఉపాధి శాఖ మంత్రివర్యులు శ్రీ వాసంశెట్టి సుభాష్ కుటుంబసభ్యులతో కలిసి శ్రీ అమ్మవారి దర్శనార్థం
తేదీ.11-07-2024:
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి:
ఈ రోజు ది.11-07-2024 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక మరియు ఉపాధి శాఖ మంత్రివర్యులు శ్రీ వాసంశెట్టి సుభాష్ కుటుంబసభ్యులతో కలిసి శ్రీ అమ్మవారి దర్శనార్థం ఆలయమునకు విచ్చేయగా ఆలయ కార్యనిర్వాహణాధికారి కె ఎస్ రామరావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, శ్రీఅమ్మవారి దర్శనం కల్పించారు.
అనంతరం వీరికి వేదపండితులు వేదాశీర్వచనము చేయగా కార్యనిర్వాహణాధికారి వారు అమ్మవారి శేషవస్త్రము, ప్రసాదము, చిత్రపటంను అందజేసినారు.