సాంకేతిక పరిజ్ఞానంతో
విద్యార్థులకు మెరుగైన భవిష్యత్తు
కేబీఎన్ కాలేజీలో
కంప్యూటర్ ల్యాబ్
ప్రారంభించిన విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ పశ్చిమ, జులై 15:-
విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానంతో మరింత మెరుగైన ఉపాధి తద్వారా మంచి భవిష్యత్తు పొందుతారని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి పేర్కొన్నారు.
సోమవారం సాయంత్రం పశ్చిమ నియోజకవర్గం లోని కేబీఎన్ కళాశాలలో కంప్యూటర్ ల్యాబ్ ను
ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రారంభించారు.
ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానం పొందడం ద్వారా వారి భవిష్యత్తుకు మేలు చేసిన వారు అవుతారని తెలియజేశారు. ఆధునిక కాలంలో కంప్యూటర్ జీవిత అవసరాల్లో ఒక భాగం అయిందన్నారు.విద్యార్థులు ఈ కంప్యూటర్ ల్యాబ్ ను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో కె బి ఎన్ కళాశాల ప్రిన్సిపల్
నారాయణరావు, కాలేజీ సిబ్బంది విద్యార్థులు,
ఎన్టీఆర్ జిల్లా భాజపా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్,
తెలుగుదేశం పార్టీ నేత బొమ్మసాని సుబ్బారావు,ఎన్డీఏ నాయకులు తదితరులు పాల్గొన్నారు