Home Andhra Pradesh కేబీఎన్ కాలేజీలో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభించిన విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా...

కేబీఎన్ కాలేజీలో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభించిన విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి

4
0

 సాంకేతిక పరిజ్ఞానంతో

విద్యార్థులకు మెరుగైన భవిష్యత్తు 

కేబీఎన్ కాలేజీలో

 కంప్యూటర్ ల్యాబ్

ప్రారంభించిన విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజయవాడ పశ్చిమ, జులై 15:-

విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానంతో మరింత మెరుగైన ఉపాధి తద్వారా మంచి భవిష్యత్తు పొందుతారని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి పేర్కొన్నారు.

సోమవారం సాయంత్రం పశ్చిమ నియోజకవర్గం లోని కేబీఎన్ కళాశాలలో కంప్యూటర్ ల్యాబ్ ను 

ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రారంభించారు. 

ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానం పొందడం ద్వారా వారి భవిష్యత్తుకు మేలు చేసిన వారు అవుతారని తెలియజేశారు. ఆధునిక కాలంలో కంప్యూటర్ జీవిత అవసరాల్లో ఒక భాగం అయిందన్నారు.విద్యార్థులు ఈ కంప్యూటర్ ల్యాబ్ ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. 

ఈ కార్యక్రమంలో కె బి ఎన్ కళాశాల ప్రిన్సిపల్ 

నారాయణరావు, కాలేజీ సిబ్బంది విద్యార్థులు, 

ఎన్టీఆర్ జిల్లా భాజపా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్,

తెలుగుదేశం పార్టీ నేత బొమ్మసాని సుబ్బారావు,ఎన్డీఏ నాయకులు తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here