విజయవాడ నగరపాలక సంస్థ
విజయవాడ నగరపాలక సంస్థ విస్తృతంగా నిర్వహించిన ఫ్రైడే – డ్రై డే
నగర ప్రజలకు సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ లాంటి జ్వరాలపై అవగాహన కార్యక్రమాలు
64 డివిజన్లో ఫ్రైడే – డ్రై డే అవగాహన కార్యక్రమం
ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు డెంగ్యూ మలేరియా డయేరియా వ్యాధులను అరికట్టేందుకు ప్రజలకు వాటి నివారణకై అవగాహన కార్యక్రమాలను, విజయవాడ నగరపాలక సంస్థ విస్తృతంగా నిర్వహించింది.
శుక్రవారం ఉదయం విజయవాడ నగరపాలక సంస్థ నిర్వహించిన “ఫ్రైడే -డ్రై డే ” కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గం 30 డివిజన్ లో జిల్లా కలెక్టర్ జి సృజన, తూర్పు నియోజకవర్గం నాలుగవ డివిజన్లో గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్, శాసన సభ్యులు గద్దె రామ్మోహన్రావు, పశ్చిమ నియోజకవర్గం 46వ డివిజన్లో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి సైతం పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు.
విజయవాడ నగరపాలక సంస్థ 64 డివిజన్లోనూ “ఫ్రైడే – డ్రై డే” కార్యక్రమం ద్వారా మలేరియా, డెంగ్యూ, డయేరియా వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు డివిజన్ కార్పొరేటర్లు, హెల్ సెక్రటరీలు, ఎమినిటీ సెక్రటరీలు, ప్రజారోగ్య సిబ్బంది ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి వర్షపు నీటి నిల్వలు వల్ల పుట్టే దోమలు, వాటి ద్వారా సోకే మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా లాంటి జ్వరాల బారిన పడకుండా ఉండేందుకు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన నివారణ పద్ధతులు ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పడమే కాకుండా. ప్రతి శుక్రవారం ఇంటిలో ఉన్న నీటి నిల్వలైన వాడేసి పడిన కొబ్బరి చిప్పలు, రోలు, టైర్లు, పూల కుండీలు, ఫ్రిడ్జ్ బయట భాగం లో నిల్వ ఉండే నీరు, కూలర్ లో ఉన్న నీరు, ఇలా ప్రతి వస్తువులో నిల్వ ఉన్న నీటిని వారంలో ఒకసారి, అదే ప్రతి శుక్రవారం, డ్రై డే గా మార్చుకోవాల్సిందిగా, ఆ నీటి నిల్వలను పారవేసి శుభ్రపరచుకుటం వలన, దోమలు పుట్టే అవకాశం ఉండవని, తద్వారా దోమలు వల్ల కలిగే వ్యాధులైన మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా లాంటి జ్వరాలు సోకవని, ప్రజలు ఆరోగ్యంగా ఉండవచ్చని అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ కార్పొరేటర్లు, విజయవాడ నగర పలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ ఏ మహేష్, అడిషనల్ కమిషనర్ ప్రాజెక్ట్స్ కేవీ సత్యవతి, డిస్టిక్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ గీత బాయ్, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పి రత్నావళి, జోనల్ కమిషనర్లు రమ్య కీర్తన, ప్రభుదాస్, శివరామకృష్ణ, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్లు డాక్టర్ సురేష్ బాబు డాక్టర్ రామకోటేశ్వరరావు డాక్టర్ బాబు శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఏ యస్ ఎన్ ప్రసాద్, శ్రీనివాస్, సామ్రాజ్యం, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.