Home Political news రాష్ట్రాభివృద్ధి రొట్టె ప‌ట్టుకున్న మంత్రి నారాయ‌ణ‌ ప్ర‌జ‌లంద‌రిపై అల్లాహ్ ద‌య ఉండాలి ద‌ర్గా...

రాష్ట్రాభివృద్ధి రొట్టె ప‌ట్టుకున్న మంత్రి నారాయ‌ణ‌ ప్ర‌జ‌లంద‌రిపై అల్లాహ్ ద‌య ఉండాలి ద‌ర్గా అభివృద్ధి జ‌రిగింది ఒక్క‌ టీడీపీ హ‌యాంలోనే బారాష‌హీద్ ద‌ర్గా అభివృద్ధిని విస్మ‌రించిన వైసీపీ ప్ర‌భుత్వం

4
0

 రాష్ట్రాభివృద్ధి రొట్టె ప‌ట్టుకున్న మంత్రి నారాయ‌ణ‌

ప్ర‌జ‌లంద‌రిపై అల్లాహ్ ద‌య ఉండాలి

ద‌ర్గా అభివృద్ధి జ‌రిగింది ఒక్క‌ టీడీపీ హ‌యాంలోనే

బారాష‌హీద్ ద‌ర్గా అభివృద్ధిని విస్మ‌రించిన వైసీపీ ప్ర‌భుత్వం

రాష్ట్ర ఖ‌జానా ఖాళీ అయినా…ద‌ర్గా అభివృద్ధి కోసం సీఎం రూ. 5కోట్లు మంజూరు

అంద‌రి స‌మ‌న్వ‌యంతోనే ముందుకెళుతాం

రొట్టెల‌కి అశేషంగా త‌ర‌లి వ‌స్తోన్న భ‌క్తులు

రొట్టెల పండుగ‌కి ప‌క‌డ్భందీగా ఏర్పాట్లు చేశాం

ఏర్పాట్ల‌పై భ‌క్తులంద‌రూ సంతోషంగా ఉన్నారు

రాష్ట్ర పుర‌పాల‌క శాఖామంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ‌

పాల్గొన్న జిల్లా అధ్య‌క్షులు, ఎమ్మెల్యేలు, ఎంపీ, టీడీపీ ముఖ్య నేత‌లు 

నెల్లూరు బారాష‌హీద్ ద‌ర్గాలో జ‌రిగే రొట్టెల పండుగ సంద‌ర్భంగా… స్వ‌ర్ణాల చెరువులో రాష్ట్ర పుర‌పాల‌క శాఖామంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ రాష్ట్రాభివృద్ధి రొట్టెను ప‌ట్టుకున్నారు. ఆంధ్ర‌రాష్ట్రం బాగా అభివృద్ధి చెంద‌డంతోపాటు ప్ర‌జ‌లంద‌రూ సంతోషంగా ఉండాల‌ని…మంత్రి ఆకాంక్షించారు. నెల్లూరు బారాష‌హిద్ ద‌ర్గాలో జ‌రుగుతున్న రొట్టెల పండుగ‌లో….ఎమ్మెల్యేలు వేమిరెడ్డి ప్ర‌శాంతిరెడ్డి, సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి, రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డిల‌తో క‌లిసి నారాయ‌ణ పాల్గొన్నారు. ముందుగా మంత్రి నారాయ‌ణ‌కి ద‌ర్గా క‌మిటీ చైర్మ‌న్‌, స‌భ్యులు, ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా ద‌ర్గా ప్రాంగ‌ణంలో నారాయ‌ణ ప‌ర్య‌టిస్తూ…భ‌క్తుల్ని ఎంతో ఆప్యాయంగా ప‌ల‌క‌రించారు. ఏర్పాట్లు ఎలా ఉన్నాయ‌ని భ‌క్తుల్ని ఆయ‌న అడిగి తెలుసుకున్నారు. ఏర్పాట్లు చాలా బాగున్నాయ‌ని మంత్రికి భ‌క్తులు తెలియ‌జేయ‌డంతో సంతోషం వ్య‌క్తం చేశారు. అనంత‌రం…ఎమ్మెల్యేలు, ఎంపీ, టీడీపీ నేత‌ల‌తో క‌లిసి మంత్రి నారాయ‌ణ రాష్ట్రాభివృద్ధి రొట్టెను ప‌ట్టుకున్నారు. 

ఈ సంద‌ర్భంగా మంత్రి నారాయ‌ణ మీడియాతో మాట్లాడారు. బారాష‌హీద్ ద‌ర్గా రొట్టెల పండుగ ఈనెల 17వ‌తేదీన ప్రారంభ‌మైంద‌న్నారు. వ‌ర్షాన్ని సైతం లెక్క చేయ‌కుండా పండుగ‌కి భ‌క్తులు అశేషంగా వ‌స్తుండ‌డం ఆనందంగా ఉంద‌న్నారు. ఈ రోజు ఉద‌యం రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు అమ‌రావ‌తి నుంచి వ‌ర్చువ‌ల్ గా పండుగ ఏర్పాట్ల‌ను ప‌రిశీలించ‌డంతో పాటు…భ‌క్తుల‌తో మాట్లాడ‌డం జ‌రిగింద‌న్నారు. 2014కి ముందు బారాష‌హీద్ ద‌ర్గాలో డెవ‌ల‌ప్ మెంట్ పూర్తిగా జీరో అన్నారు. ఇదే స్వ‌ర్ణాల చెరువులో లారీలు, కార్లు, బ‌స్సులు శుభ్రం చేసుకునే వార‌ని గుర్తు చేశారు. 2014లో టీడీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక‌…నేను మంత్రిగా ఉన్న‌ప్పుడు ఎంతో ప‌విత్ర‌మైన ప్ర‌దేశం బారాష‌హీద్ ద‌ర్గాని…ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతో మాట్లాడి ఎంతో అభివృద్ధి చేశామ‌న్నారు. ప్ర‌ధానంగా ద‌ర్గా ఆవ‌ర‌ణ‌లో మ‌రుగుదొడ్లు, ఘాట్‌, భ‌క్తుల‌కి అనేక వ‌స‌తులు ఏర్పాటు చేశామ‌ని తెలిపారు. ఆనాడు ద‌ర్గాలో ప్రార్ధ‌నా మందిరం నిర్మించాల‌ని…రొట్టెల పండుగ‌కి చంద్ర‌బాబు వ‌చ్చార‌ని…అప్పుడే ద‌ర్గా అభివృద్ధికి రూ. 20 కోట్లు మంజూరు చేశార‌న్నారు. కానీ ఆ ప‌నుల‌ను గ‌త ప్ర‌భుత్వం నిలిపి వేసింద‌న్నారు. ఈ రోజు జ‌రిగిన వ‌ర్చువ‌ల్ కార్య‌క్ర‌మంలో వెంట‌నే ఆ ప‌నుల‌ను పూర్తి చేయాల‌ని…అప్పుడే రూ. 5 కోట్ల రూపాయ‌ల‌ను చంద్ర‌బాబు నాయుడు ఆదేశాలు జారీ చేశార‌ని చెప్పారు. ఈ సంద‌ర్భంగా ద‌ర్గా క‌మిటీ, ప్ర‌జ‌లు, భ‌క్తుల త‌ర‌పున సీఎం చంద్ర‌బాబుకి ప్ర‌త్యేకంగా ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాన‌ని పేర్కొన్నారు. ఎందుకంటే రాష్ట్ర ఖ‌జానా ఖాళీ అని…ఏ శాఖ‌లోనూ పైసా లేద‌న్నారు. రాష్ట్ర ఆర్ధిక ప‌రిస్థితి అత‌లాకుత‌లంగా ఉంద‌న్నారు. ఇటువంటి ప‌రిస్థితిలో కూడా రూ. 5 కోట్లు మంజూరు చేయ‌డం గొప్ప విష‌య‌మ‌న్నారు. రాష్ట్ర ఆర్ధిక ప‌రిస్థితి మెరుగు ప‌డిన త‌రువాత‌… ముస్లిం మత పెద్ద‌లు, క‌మిటీ స‌భ్యులు, వ‌క్ఫ్ బోర్డు స‌భ్యులు, నాయ‌కులతో మాట్లాడి ఒక ప్ర‌ణాళికంగా ముందుకెళ్లి ద‌ర్గాని అన్నీ విధాలా అభివృద్ధి చేస్తామ‌ని చెప్పారు. రొట్టెల పండుగ‌కి తెలుగుదేశం ప్ర‌భుత్వ‌మే రాష్ట్ర పండుగ‌గా చేసింద‌న్నారు. ఈ పండుగ‌ని ఇంట‌ర్నేష‌న్ పండుగ‌గా చేయాల‌ని ముఖ్య‌మంత్రి ఆదేశించ‌డం జ‌రిగింద‌న్నారు. రొట్టెల పండుగ‌పై భ‌క్తుల‌కి ఎంతో న‌మ్మ‌కం ఉంద‌న్నారు. వారి కోర్కెలు తీర‌డంతోనే ఏడాదికేడాది భ‌క్తుల సంఖ్య‌లో గ‌ణనీయంగా పెరుగుతుంద‌ని తెలిపారు. త‌దనంత‌రం జిల్లా అధ్య‌క్షులు అబ్ధుల్ అజీజ్‌, ఎమ్మెల్యేలు కోటంరెడ్డి, ప్ర‌శాంతిరెడ్డి, టీడీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కోటంరెడ్డి శ్రీ‌నివాసులురెడ్డి, మాజీ మున్సిప‌ల్ చైర్ ప‌ర్స‌న్ తాళ్ల‌పాక అనూరాధ‌లు ప్ర‌సంగించారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజిజ్,ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తో పాటు, కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కొటంరెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ,మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తాళ్లపాక అనురాధ, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, టిడిపి ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here