19.07.2024
ఏపీ మెడ్ టెక్ జోన్ ను సందర్శించిన ఎం.ఎస్.ఎం.ఈ. మంత్రి
వైద్య పరికరాల తయారీ, వసతుల గురించి తెలుసుకున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్
వివిధ కంపెనీల సీఈవోలతో ఆత్మీయ భేటీ, మార్కెటింగ్ ట్రెండ్ తదితర అంశాలపై చర్చ
విశాఖపట్టణం
విశాఖపట్టణం ఉక్కు నగరం పరిధిలో ఉన్న ఏపీ మెడ్ టెక్ జోన్ ను రాష్ట్ర ఎం.ఎస్.ఎం.ఈ, సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శుక్రవారం సాయంత్రం సందర్శించారు. అక్కడ వివిధ కంపెనీల ఆపరేషన్స్ ప్రక్రియలను పరిశీలించారు. వైద్య పరికరాల తయారీకి సంబంధించిన వివిధ కంపెనీలను సందర్శించిన ఆయన వివిధ కంపెనీల సీఈవోలతో ఆత్మీయంగా భేటీ అయ్యారు. అక్కడున్న వసతులు, కంపెనీలు, ఉద్యోగులు ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా పరిశ్రమల శాఖ అధికారులు, మెడ్ టెక్ జోన్ ప్రతినిధులు అక్కడున్న వివిధ కంపెనీలను చూపించారు. వాటి ద్వారా ఉత్పత్తయ్యే పరికరాలు, మార్కెటింగ్ ట్రెండ్ ఇతర అంశాల గురించి వివరించారు. ఆయన వెంట పలు కంపెనీల సీఈవోలు, విశాఖపట్టణం, అనకాపల్లి జిల్లాల పరిశ్రమల శాఖ అధికారులు గణపతి, శ్రీధర్ ఉన్నారు.
.