శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం,ఇంద్రకీలాద్రి, విజయవాడ’*30 మే 2025
ఇంద్రకీలాద్రిపై కార్యనిర్వహణాధికారి వి. కె. శీనానాయక్ శుక్రవారం వివిధ విభాగాలను పరిశీలించారు. ఇందులో భాగముగా దేవస్థానం నందు కొండ క్రింద, పైన జరుగుచున్న అభివృద్ధి పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి, ఇంజినీరింగ్ అధికారులు తో సదరు పనుల స్థితి గురించి చర్చించి, పనులు నాణ్యత తో ఉండేలాగా చూస్తూ త్వరిత గతిన పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. శుక్రవారం భక్తుల రద్దీ దృష్ట్యా పలు ప్రదేశాలలో ఏర్పాట్లను, టాయిలెట్ లు, త్రాగు నీటి కొళాయిలు, తదితరములును ఆకస్మికముగా క్షేత్ర స్థాయిలో పరిశీలించి, శానిటేషన్ మరియు త్రాగు నీటి వసతుల వసతులను త్వరగా మెరుగుపరచుటకు సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమం లో దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.