Home Political news రాజ్య స‌భ ఎం.పి పి.టి. ఉష‌ను క‌లిసిన ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని)

రాజ్య స‌భ ఎం.పి పి.టి. ఉష‌ను క‌లిసిన ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని)

3
0

 రాజ్య స‌భ ఎం.పి పి.టి. ఉష‌ను క‌లిసిన ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) 

ఢిల్లీ: ఢిల్లీ మాజీ క్రీడాకారిణి, రాజ్య స‌భ ఎంపి పిటి ఉష ను విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) సోమ‌వారం ఆమె నివాసంలో క‌ల‌వ‌టం జ‌రిగింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ అథ్లెట్స్ కి బ్రాండ్ అంబాసిడ‌ర్ గా వుండాల‌న్న రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆకాంక్ష‌ను తెలియజేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో క్రీడ‌ల‌ను, క్రీడాకారుల‌ను ప్రోత్స‌హించ‌టానికి సీఎం చంద్ర‌బాబు నాయుడు ఏ విధమైన‌ చ‌ర్య‌లు తీసుకుంటున్నారో స‌వివ‌రంగా వివ‌రించారు. సీఎం చంద్ర‌బాబు నాయుడు ఆలోచ‌న‌ను అర్థం చేసుకున్న‌ రాజ్య సభ ఎంపి పిటి ఉష సానుకూలంగా స్పందించారు. త్వ‌ర‌లో ఆంధ్ర‌ప్రదేశ్ రాష్ట్రానికి విచ్చేసి ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడును కలుస్తాన‌ని ఎంపి కేశినేని శివనాథ్ కు తెలియ‌జేశారు.  

ఎంపి కేశినేని శివ‌నాథ్ పుష్ప‌గుచ్చం అందించి క్రీడాకారిణిగా పిటి ఉష సాధించిన విజ‌యాల‌ను గుర్తు చేశారు. ఒలింపిక్ క్రీడల అథ్లెటిక్స్ లో పైనల్స్ చేరిన తొలి మహిళా క్రీడాకారిణిగా పిటి ఉష రికార్డు సృష్టించింది. 1983 నుంచి 1989 మధ్యకాలంలో ఉష ఆసియన్ ట్రాక్ అండ్ ఫీల్డ్స్ పోటీలలో 13 స్వర్ణ పతకాలను సాధించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here