ఒబిసి మోర్చా నాయకులకు అందరికి నమస్కారం,
గొప్ప ప్రజారంజక బడ్జెట్ గా కేంద్ర బడ్జెట్ 2024 వుంది.
ఈ అంశాలపై అందరు మాట్లాడవలెను రేపు ప్రతి ఒక్కరు ప్రెస్ నోట్ ఇవ్వవలెను.
ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున నరేంద్రమోదీ కి ధన్యవాదములు చెపుదాం
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై మోడీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుంది.
కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయింపులు చేయడం ద్వారా రాష్ట్ర ప్రజలకు భవిష్యత్ పై భరోసా కలిపించారు
కేంద్ర బడ్జెట్-2024లో ఆంధ్రప్రదేశ్కు కీలక సాయం ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వివిధ ఏజెన్సీల ద్వారా రూ. 15 వేల కోట్లను ఏర్పాటుచేస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ చెప్పారు. రానున్న సంవత్సరాలలోనూ సాయం కొనసాగుతుందన్నారు.
అలాగే, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రైతులు, దేశ ఆహార భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి సహకరిస్తామన్నారు.
రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలు.. ప్రకాశం జిల్లాకు సాయం ఉంటుందన్నారు.
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధికి కేంద్రం నుంచి సహకారం ఉంటుందని.. విశాఖ-చెన్నై కారిడార్లో ఉన్న కొప్పర్తి నోడ్ , హైదరాబాద్-బెంగళూరు కారిడార్లోని ఓర్వకల్లుకు నిధులు కేటాయిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని హామీలను అనుసరించి సాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
2014 నుండి ప్రతి అంశంలో రాష్ట్ర శ్రేయస్సుకు పెద్దపీట వేస్తూనే మోడీ ప్రభుత్వం పని చేస్తుంది. రాష్ట్రాన్ని కన్న బిడ్డలా చూస్తూనే వుంది మోడీజీ ప్రభుత్వం.
ప్రతి బడ్జెట్ లో అంశాల వారీ ప్రకటించిన బడ్జెట్ లో గొప్ప నిధులు రాష్ట్రానికి వస్తుంది. తద్వారా గ్రామాల అభివృద్ధి నగరాల ఆధునీకరణ మౌలిక వసతులు రోడ్లు రైల్వే విమానయాన రంగాలలో అభివృద్ధి ప్రజా సంక్షేమం కేంద్ర ప్రభుత్వమే చూస్తుంది.
వికశిత భారత్ – వికశిత ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధన దిశగా ఈ కేంద్ర బడ్జెట్ వుంది. అన్ని రాష్ట్రాలలో గొప్ప అభివృద్ధి లక్ష్యంగా పని చేస్తూ పేద మధ్య తరగతుల వారి జీవన ప్రమానాలు మెరుగు అవ్వే విధంగా ఈ బడ్జెట్ రూపొందించడం అయ్యింది. గొప్ప ఫలితాలను భావితరాలు చూడబోతున్నాయి. మహిళా సాధకారత మరియు సామాజిక ఆర్ధిక సమానత్వాన్ని దేశంలో సాధించే బడ్జెట్
ఈ సంధర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం తరపున ప్రియతమ ప్రధాని నరేంద్రమోడీకి ఎండిఏ ప్రభుత్వానికి భారతీయ జనతా ఒబిసి మోర్చా ధన్యవాదాలు తెలుపుతుంది.
రాష్ట్ర అధ్యక్షులు గోపీశ్రీనివాస్ రొంగల