కార్గిల్ వీరజవానుల వీర గాథలను రాబోయే తరాలకు చెప్పండిరాష్ట్ర వైధ్య ఆరోగ్య శాఖామంత్రి సత్యకుమార్ యాదవ్.
కార్గిల్ వీర జవానుల వీర గాథలను రాభోయే తరాలకు చెప్పాలంటూ కెఎల్ డీమ్డ్ యూనివర్శిటీ విద్యార్దులకు రాష్ట్ర వైధ్య, ఆరోగ్య శాఖామంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపు నిచ్చారు. దేశ సరిహద్దులలో పహారా కాస్తున్న వీర జవానుల త్యాగాలు మరువలేనివి అని ఆయన అన్నారు. శుక్రవారం నాడు స్థానిక కెఎల్ డీమ్డ్ యూనివర్శిటీలో బిజెపి యువ మోర్చా అద్వర్యంలో, ఎన్ సిసి 22 ఆంధ్రా బెటాలియన్, 10 ఆంధ్రా బెటాలయిన్ ల సహకారంతో ఏర్పాటు చేసిన కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయిన ఆయన విద్యార్దుల నుద్దేశించి ప్రసంగించారు. ఎన్డీఎ ప్రభుత్వం అద్వర్యంలో భారత్ కు సైనిక, ఆయుధ బలం పెరిందన్నారు. దేశ ప్రధాని మోది ప్రపంచదేశాల శాంతి కోసం కృషిచేయడం దేశ ప్రజలందరూ గర్వపడాల్సిన విషయమన్నారు. ఆర్టికల్ 370 రద్దు చేసి వేర్పాటు వాదుల నోరు మూయించిన మోది సర్జికల్ స్ట్రైక్ వంటి సాహసోపేతమైన చర్యలతో దేశ ప్రజల మన్ననలు పొందారని అన్నారు. నూతన విద్యా విధానంతో మోదీ బావి భారత పౌరులకు నూతన ఆవిష్కరణల పట్ల అవగాహన కల్పించారని అన్నారు. అగ్ని వీర్ వంటి పథకాల ద్వారా యువత సైన్యంలో సులువుగా చేరే అవకాశాన్ని మోదీ కల్పించారని అన్నారు. 1999 నాటి యుద్ద వాతావరణానికి పాకిస్తాన్ కారణమైతే దానిని తిప్పికొట్టడంలో భారత వీర జవానులు ధైర్య సాహసాల ముందు పాక్ దుఛ్చర్యలు ఎంతమాత్రం నిలవలేదని తెలియజేశారు. సుమారు సముద్ర మట్టానికి 17 వేల అడుగుల ఎత్తులో మంచు పర్వతాల నడుమ మైనస్ 40 డిగ్రీల వాతావరణంలో సైతం దేశ సరిహద్దును ఆక్రమించుకున్న పాకిస్తాన్ కు భారత సైనికులు తగిన గుణపాఠం నేర్పి ఐదువేల మంది వీర జవానులు నేలకొరిగారని గుర్తు చేశారు. రాబోయే తరాలకు కార్గిల్ వీర జవానుల చరిత్రను చెప్పాల్సిన భాద్యత నేటి విద్యార్దులపైన ఉందని అన్నారు.
కెఎల్ యు రిజిస్ట్రార్ డాక్టర్ కె.సుబ్బారావు మాట్లాడుతూ కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశ పెట్టిన ఆయా పథకాలను విద్యార్దులు సైతం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్గిల్ లో వీర మరణం పొందిన వీర జవానులకు ఘనంగా నివాళులర్పించారు. మోదీ నాయకత్వంలో సైన్యానికి అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ఆయుధాలు అందుబాటులో ఉండడం దేశానికే గర్వకారణమన్నారు. విద్యార్ది దశ నుండే ప్రతీ ఒక్కరూ దేశ రక్షణ పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. సైనికుల త్యాగాలు ఎప్పటికీ మరువకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో కెఎల్ వర్శిటీ వైస్ చాన్సులర్ డాక్టర్ జి.పార్ధసారదివర్మ, ప్రో విసిలు డాక్టర్ ఎవిఎస్.ప్రసాద్, డాక్టర్ ఎన్. వెంకట్ రామ్, డాక్టర్ కె.రాజశేఖర రావు, రిజిస్ట్రార్ డాక్టర్ కె.సుబ్బారావు, విధ్యార్ధి సంక్షేమ విభాగ డీన్ డాక్టర్ కెఆర్ఎస్.ప్రసాద్, ఫ్యాకల్టీ డీన్ డాక్టర్ వేమూరి శ్రీకాంత్, ఎన్ సిసి ఆఫీసర్లు లెప్టినెంట్ వి.మౌనిక, లెప్టినెంట్ పావని, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు రోహన్ సైదులు, రాష్ట్ర యువ మోర్చ అధ్యక్షులు మిట్టా వంశీ, గుంటూరు జిల్లా ఇంచార్జి రామకృష్ణా రెడ్డి, ప్రొఫెసర్ సుభాకర్ రాజు తదితరులు పాల్గొన్నారు.