జర్నలిస్టుల సంక్షేమానికి నా సహకారం ఎప్పుడూ ఉంటుంది
సమాజంలో పత్రిక రంగాన్ని కొందరు దిగజారుస్తున్నారు
యాజమాన్యాలతో పని లేకుండా సొంతగా ఛానల్స్ పెట్టి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు
మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు
మైలవరంలో ఏపీఎంపిఏ సర్వసభ్య సమావేశం విజయవంతం
మైలవరం:జర్నలిస్టుల సంక్షేమానికి నా సహకారం ఎల్లప్పుడూ ఉంటుందనీ, అయితే సమాజంలో పత్రిక రంగాన్ని కొందరు దిగజారుస్తున్నారని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ అన్నారు.ఎన్టీఆర్ జిల్లా, మైలవరం నియోజకవర్గ కేంద్రంలోని రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ హాల్ లో సోమవారం ఏపీఎంపిఏ జిల్లా సర్వసభ్య సమావేశం జరిగింది.ఈ సమావేశానికి ఆత్మీయ అతిథులుగా ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి నెట్టెం రఘురాంతో పాటు మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ హాజరయ్యారు.ఏపిఎంపిఏ రాష్ట్ర కార్యదర్శి యేమినేని వెంకటరమ ణ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఏపిఎంపిఏ రాష్ట్ర అధ్యక్షులు వీర్ల శ్రీరామ్ యాదవ్,రాష్ట్ర ఉపాధ్యక్షులు మన్నే సోమేశ్వరరావు,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాఖమూరి మల్లికార్జునరావు, కోశాధికారి మత్తి శ్రీకాంత్,జనసేన మైలవరం నియోజకవర్గ ఇన్చార్జి అక్కల రామ్మోహన్ రావు (గాంధీ),సూఫీ మత గురువులు అల్తాఫ్ బాబా, ఏపీఎంపిఏ విజయవాడ నగర అధ్యక్షులు తాళ్లూరి అనిల్ కుమార్, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ పసుపులేటి చైతన్య హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా జర్నలిస్టులు సమాజ హితం కోసం పనిచేయాలన్నారు. సమాజంలో పాత్రికేయులు పత్రికా రంగం విలువలు కాపాడాలని తెలిపారు పత్రికలు, రాజకీయాలు ఇలా అన్ని రంగాలలో విపరీతమైన దుందుడుకు తత్వం ఏర్పడిందన్నారు. సమాజంలో జరుగుతున్న లోటుపాట్లను ఎత్తి సోపాల్సిన పత్రిక రంగాన్ని కొందరు దిగజార్చడం బాధాకరమన్నారు. యాజమాన్యాలతో పని లేకుండా నేడు సొంతగా సోషల్ మీడియా,యూట్యూబ్ ఛానల్స్ ప్రింట్ చేయకుండా పి డి ఎఫ్ లు పెట్టి బ్లాక్ మెయిల్ లకు పాల్పడుతు న్నారని ఆరోపించారు. ఇలాంటివారిని ఏపీఎంపిఏ లో చేర్చుకోవద్దని, అసోసియేషన్ లో నిజమైన విలేకరులకే సభ్యత్వం కల్పించండని రాష్ట్ర నాయక త్వానికి సూచించారు.నేడు కుల, పార్టీల పరంగా పత్రికలు పుట్టుకొచ్చాయన్నారు మీడియాలో పెడధోరణినితో వ్యవహరిం చే జర్నలిస్టుల యూనియన్లు నియంత్రిం చాలన్నారు.ఈ విషయంలో తనను అన్యధా భావించవద్దన్నారు.తనను అపార్ధం చేసుకోకుండా ఒక ఎమ్మెల్యే గా కాకుండా మీ సోదరునిలా భావించి వాస్తవాలను గ్రహించాలని విజ్ఞప్తి చేశారు.అయితే చాలా మంది పాత్రికేయులు అంకిత భావంతో పనిచేస్తున్నారని అభినందించారు.అన్ని రంగాల్లోను,అన్ని వర్గాలవారిని చైతన్య పరుస్తూ ఫోర్త్ ఎస్టేట్ గా ఉన్న పాత్రికేయులకు తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు.నిజాన్ని నిర్భయంగా చాటి చెప్పే మీడియా సోదరులకు అభినందనలు తెలిపారు. మైలవరం నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి,ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చేందుకు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు,పాత్రికేయులు కలిసి పనిచేద్దామన్నారు.మైలవరంలో ప్రెస్ క్లబ్ నిర్మాణానికి తన సంపూర్ణ సహకారాన్ని అందిస్తానన్నారు.తాను చేయగలిగింది చెబుతాననీ,లేదంటే నా వల్ల కాదని చెబుతానని ఎమ్మెల్యే అన్నారు. జిల్లా అధ్యక్షుడిగా జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని నెట్టెం రఘురాం హామీ ఇచ్చారు.అక్కడ గాంధీ మాట్లాడుతూ గతంలో ఎంతో మంది పాత్రికేయులకు స్థలాలు ఇవ్వడం జరిగిందని, ఎన్డీఏ కోటమీ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ జర్నలిస్టుల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పని చేయనున్నట్లు వెల్లడించారు. జర్నలిస్టుల సమస్యలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లను న్నట్లు అక్కల గాంధీ తెలియజేశారు.ఈ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేతో పాటు ఆత్మీయ అతిథుల ను ఏపీఎంపిఏ రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ యాదవ్ ఆధ్వర్యంలో సంఘ నాయకు లు దుశ్శాలువాలతో ఘనంగా సత్కరిం చారు.ఈ సమావేశంలో మైలవరం ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు,జిల్లా నలుమూ లల నుంచి ప్రింట్ అండ్ ఎలక్ట్రాన్ మీడియా పాత్రికేయ తదితరులు పాల్గొన్నారు.
ఫోటో :1.సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్
2. ఎమ్మెల్యే ని సన్మానిస్తున్న ఏపిఎంపిఏ రాష్ట్ర నాయకులు