హైదరాబాద్ చెందిన ఎన్ దయానంద్ దంపతులు శ్రీ అమ్మవారికి అలంకరణ నిమిత్తం కానుకగా 52 గ్రాములు
బరువు గల బంగారు నత్తును ఇంద్రకీలాద్రి అమ్మవారికి కే రామారావుకి అందజేశారు
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి:
ఈరోజు హైదరాబాద్ కు చెందిన ఎన్ దయానంద్ దంపతులు శ్రీ అమ్మవారికి అలంకరణ నిమిత్తం కానుకగా 52 గ్రాములు బరువు గల బంగారు నత్తును గౌరవ దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ సత్యనారాయణ మరియు ఆలయ కార్యనిర్వాహనాధికారి కె ఎస్ రామరావు ను కలిసి దేవస్థానమునకు అందజేసినారు. ఆలయ అధికారులు వీరికి శ్రీ అమ్మవారి దర్శనము కల్పించగా, వేదపండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు శ్రీ అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రం, చిత్రపటం అందజేసినారు.