చల్లపల్లి, కృష్ణా జిల్లా కు చెందిన ఎస్ వెంకట సుబ్బారావు మరియు కుటుంబసభ్యులు శ్రీ అమ్మవారికి అలంకరణ నిమిత్తం కానుకగా 25 గ్రాములు
బరువు గల బంగారు ఇంద్రకీలాద్రి అమ్మవారి ఈవో కె రామారావుకి అందజేశారు
ది.10-08-2024:
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి:
ఈరోజు చింతలమడి, చల్లపల్లి, కృష్ణా జిల్లా కు చెందిన ఎస్ వెంకట సుబ్బారావు మరియు కుటుంబసభ్యులు శ్రీ అమ్మవారికి అలంకరణ నిమిత్తం కానుకగా 25 గ్రాములు బరువు గల బంగారు ఫాన్సీ హారంను ఆలయ కార్యనిర్వాహనాధికారి కె ఎస్ రామరావు ని కలిసి దేవస్థానమునకు అందజేసినారు. ఆలయ అధికారులు దాత కుటుంబమునకు శ్రీ అమ్మవారి దర్శనము కల్పించగా, వేదపండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ ఈవో శ్రీ అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రం, చిత్రపటం అందజేసినారు.