రియల్ ఎస్టేట్ రంగానికి పూర్తి స్థయిలో ప్రభుత్వ సహకారం
గత ప్రభుత్వ నిర్వాకంతో రియల్ ఎస్టేట్ రంగానికి తీవ్ర నష్టం
అమరావతితో పాటు అన్ని జిల్లాల అభివృద్ది ప్రభుత్వ లక్ష్యం
భవన నిర్మాణాలకు సింగిల్ విండో విధానంలో అనుమతులు
నరెడ్కో ఏపీ సెంట్రల్ జోన్ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో మంత్రి పొంగూరు నారాయణ
విజయవాడ:
*రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగానికి పూర్వ వైభవం తీసుకొస్తామని పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్(NAREDCO)AP సెంట్రల్ జోన్ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మంత్రి.*
రాష్ట్రంలో గత ఐదేళ్లలో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా నాశనం అయిపోయిందన్నారు..
అమరావతి రాజధాని విషయంలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా నరెడ్కో ఆందోళనకు దిగడాన్ని ప్రత్యేకంగా అభినందించారు..విభజన చట్టంలో ఒక రాజధాని ఉండాలని పెట్టారని దానికి తగ్గట్లుగానే .శ్రీకాకుళం నుంచి అమరావతికి గానీ అమరావతి నుంచి అనంతపురం కు సమాన దూరంలో ఉండేలా అమరావతి ఎంపిక జరిగిందన్నారు..మూడేళ్లలో అమరావతి రాజధానిని పూర్తి చేస్తామన్నారు….అమరావతితో పాటు 26 జిల్లాలను అభివృద్ది చేయాలనేది సీఎం చంద్రబాబు ఉద్దేశం అన్నారు…ఏ రాష్ట్రం అయినా అభివృద్ది చెందాలంటే రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ది చెందాలని…రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎం తనతో ఎన్నో సార్లు చెప్పారన్నారు మంత్రి.2014 -2019 మధ్యలో దేశంలో ఎక్కడా లేని విధంగా భవన నిర్మాణాలకు అనుమతులు ఆన్ లైన్ లో చేసామని.అధికారులు కుదరదని చెప్పినా విజయవంతంగా చేయించాననన్నారు.
భవన నిర్మాణాల అనుమతులకు నిబంధనలను సరళతరం చేస్తామన్న మంత్రి…బిల్డర్లు నిబంధనలు ఉల్లంఘించకుండా ముందుకెళ్లాలని కోరారు….అందుకే టౌన్ ప్లానింగ్ విభాగంలో కమిటీలు వేసి దేశంలో పలు రాష్ట్రాల్లో లే అవుట్స్,బిల్డింగ్స్ అనుమతులపై అధ్యయనం చేస్తున్నామన్నారు…భవన నిర్మాణాలకు అనుమతులన్నీ సింగిల్ డెస్క్ లో ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు
టీడీఆర్ బాండ్లలో అవకతవకలు అరికట్టేందుకు…రిజిస్ట్రేషన్ శాఖను మున్సిపల్ శాఖతో అనుసంధానం చేసేలా ముందుకు వెళ్తున్నామన్నారు.
నెలరోజుల్లోగా సింగిల్ డెస్క్ విధానం అమల్లోకి తెస్తామన్నారు మంత్రి.
రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధికి అవసరమైతే చట్టాల్లో మార్పులు చేస్తామని చెప్పారు.