22-08-2024
నా గెలుపులో మెగాస్టార్ అభిమానులే ప్రధాన భూమిక పోషించింది : ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)
విజయవాడ చిరంజీవి యువత ఆధ్వర్యంలో మెగాస్టార్ బర్త్ డే సెలబ్రేషన్స్
విజయవాడ : ఎంపిగా భారీ మెజార్టీతో గెలిచిన తన గెలుపులో ప్రధాన భూమిక మెగాస్టార్ అభిమానులు పోషించారని, ఆయన అభిమానులు అన్ని పార్టీల్లో వున్నారని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. పశ్చిమ నియోజవర్గంలోని కుమ్మరి పాలెం సెంటర్ విజయవాడ చిరంజీవి యువత ఆధ్వర్యంలో గురువారం చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై విజయవాడ చిరంజీవి యువత ఏర్పాటు చేసిన మెగా మెడికల్ క్యాంప్ ను ఎంపి కేశినేని శివనాథ్ ప్రారంభించారు. అంతకంటే ముందు కేక్ కట్ చేసి అభిమానులందరి తరుఫున మెగాస్టార్ చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మెడికల్ క్యాంప్ లో ఎంపి కేశినేని శివనాథ్ బోన్ మినరల్ డెన్సిటీ పరీక్షలు చేయించుకున్నారు. అలాగే వైద్య పరీక్షలకు వచ్చిన ప్రజలకు ముందులు పంపిణీ చేశారు.
అనంతరం ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ చిరంజీవి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది చాలా వుందన్నారు.. ఎవర్ని ఎప్పుడు నొప్పించని మనస్తత్వం ఆయనదని కొనియాడారు. సామాన్య కుటుంబంలో పుట్టి తన లక్ష్యం కోసం జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా, అవమానాలు ఎదురైనా పోరాడి గెలిచిన విజేత చిరంజీవి అన్నారు.అందుకే చిరంజీవికి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా అభిమానులు వున్నారు.
చిరంజీవి చారిటుబల్ ట్రస్ట్ ద్వారా సమాజానికి ఎంతో సేవ చేస్తున్న చిరంజీవి జీవితం నేటి యువతకు ఆదర్శమన్నారు. ఎన్టీఆర్ తర్వాత సినీరంగంలో మకుటం లేని రారాజు మెగాస్టార్ చిరంజీవి అన్నారు. చిరంజీవి ఆదర్శలను ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో ముందడుగు వేశారన్నారు. . ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో అన్ని సామాజిక వర్గాలకు చెందిన నాయకులకి సముచిత స్థానాలు దక్కుతాయన్నారు. అలాగే తన గెలుపు కోసం కృషి చేసిన జనసేన రాష్ట్ర నాయకులు అమ్మిశెట్టి వాసు, టిడిపి రాష్ట్ర నాయకులు బొమ్మసాని సుబ్బారావుకి ఎంపి కేశినేని శివనాథ్ ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం సీనియర్ నాయకులు బొమ్మసాని సుబ్బారావు , జనసేన రాష్ట్ర నాయకులు అమ్మిశెట్టి వాసు , విజయవాడ చిరంజీవి యువత నాయకులు రేలంగి బుజ్జి , అఖిలభారత చిరంజీవి యువతో ఉపాధ్యక్షులు కృష్ణ ప్రసాద్ , ఎల్ శ్యాంప్రసాద్, జాలూరు నాగభూషణం, నల్లమిల్లి ఆనంద్, మల్లెపు విజయలక్ష్మి , ఠాగూర్ అజయ్ వర్మ , ఏలూరు సాయి శరత్ , కె. శివశర్మ, పైడి శీను తదితరులు పాల్గొన్నారు…