Home Political news పేదరాలి భూమి లాక్కొని చంపుతామని బెదిరిస్తోన్న పిన్నెల్లి అనుచరులు

పేదరాలి భూమి లాక్కొని చంపుతామని బెదిరిస్తోన్న పిన్నెల్లి అనుచరులు

3
0

 *08.22.2024*

పేదరాలి భూమి లాక్కొని చంపుతామని బెదిరిస్తోన్న పిన్నెల్లి అనుచరులు

టీడీపీ సానుభూతి పరులైతే వైసీపీ పాలనలో పింఛన్ లు కట్

ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ పేరు చెప్పి బెదిరిస్తోన్నారని APSSAAT RD సంస్థ డైరెక్టర్ పై డీఆర్పీలు ఫిర్యాదు

గత ప్రభుత్వంలో వైసీపీ సానుకూల పరులకే పనులు చేసిన అధికారులు

తప్పుడు పనులకు పాల్పడుతోన్న అధికారులపై నేడు గ్రీవెన్స్ లో మంత్రికి ఫిర్యాదు

కాపు కార్పొరేషన్ విద్యాదీవెన బాధితులు నేడు మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో విజ్ఞప్తి చేస్తూ.. గతంలో జరిగిన వెరిఫికేషన్ కు సంబంధించిన విద్యా దీవెన డబ్బులు నేటికి అందలేదని.. దాదాపు 1100 మంది బాధితులు ఉన్నారని.. వారికి సుమారు రూ. 93 కోట్లు పెండింగ్ అమౌంట్ ఇవ్వాలని.. వారిలో సగం మందికి రూ. 5 లక్షల చొప్పున రావాల్సి ఉండగా.. మిగిలిన 550 మందికి ఫుల్ పేమెంట్ పది లక్షలు ఇవ్వాలన్నారు. ఈ డబ్బులకోసం సుమారు పది మంది కోర్టుకు వెళ్లి అమౌంట్ తెచ్చుకోగా.. మిగతా కేసులు కోర్టులో నడుస్తోన్నాయని.. బాధితులు నేడు గ్రీవెన్స్ లో  బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖా మంత్రి సవిత, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు తోట సీతారామలక్ష్మికి అర్జీని అందించి విన్నవించుకోన్నారు. దయ చేసి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. వినతులు స్వీకరించిన మహిళా నేతలు అర్జీదారుల సమస్యల పరిష్కారానికి అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.  

మాచర్ల మండలం తాళ్లపల్లి గ్రామానికి చెందిన సంకుల వెంకటరావమ్మ విజ్ఞప్తి చేస్తూ… తనకు  ప్రభుత్వం ఇచ్చిన భూమి రికార్డులు తారుమారు చేసి.. తనభూమిని మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అనుచరులు దేవిరెడ్డి శ్రీనివాసరెడ్డి వైసీపీ జిల్లా యూత్ అధ్యక్షుడు, ఎందూరి కృష్ణారెడ్డి, పల్లపాటి గురుబ్రహ్మం  మాచర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ లు కొట్టేశారని. దేవిరెడ్డి శ్రీనివాసరెడ్డి కుమారుడి పేరుమీద వారసత్వభూమిగా ఎక్కించారని… దానిపై వారిని ప్రశ్నిస్తే చంపుతామని బెదిరించారి.. ఎమ్మార్వో ఆపీస్ కు వెళ్లి అడిగినా అక్కడ పట్టించుకోలేదని దయచేసి వారి నుండి తన భూమిని విడిపించి న్యాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేసింది.  

గుంటూరు జిల్లా గుంటూరులోని లాలా పేటలో ఉన్న పెద్దమసీదుకు కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని వాటిని ఆ మసీద్ ముతవల్లి కలీంబేగ్ కొట్టేస్తున్నారని.. ఇప్పటికే రెడ్డిపాలెంలో ఉన్న 187 ఎకరాల్లో 12 ఎకరాలను కబ్జా చేశారని… అక్కడ ఒక్క ఎకరం విలువ దాదాపు రూ. 10 కోట్లు ఉంటోందని. ఇంత ఆస్తులు ఉన్నా.. మసీదు హక్కుదారులు కూలీ పనులకు పోవాల్సి వస్తోందని..   ముతవల్లి కలీంబేగ్ ఒక్కడే మసీద్ ఆస్తులను దిగమింగుతూ… మసీదు అభివృద్ధిని పట్టించుకోవడంలేదని.. గత సంవత్సరం నుండి కరెంట్ బిల్లు కూడా కట్టలేదని.. అతనిపై ఎన్నో ఫిర్యాదులు చేసినా వక్ఫ్ బోర్డు వాళ్లు పట్టించుకోవడంలేదని.. ముతవల్లి పదవి నుండి కలీంబేగ్ ను తొలగించాలని కరీమ్ అనే వ్యక్తి  నేడు గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశాడు.  

డైరెక్ట్ సర్వే సెటిల్ మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్ ఆఫీస్ లో సీనియర్ అసిస్టెంట్ గా పనేస్తోన్న భూమిడి సూర్యకాంతి విజ్ఞప్తి చేస్తూ.. విధినిర్వహణలో 2013 నుండి నిబద్దతతో పనిచేసినందుకు తనకు మండల రెవన్యూ ఇనెస్పెక్టర్ గా ప్రమోషన్ ఇచ్చారని.. అయితే తన ఆఫీసులో ఆమె చేయని తప్పుకు షోకాజ్ నోటీసులు ఇచ్చి.. రిలీవ్ చేయకుండా వాళ్ల ఆఫీస్ డైరెక్టర్ బి. లత్కర్ ఇబ్బందులు పెడుతున్నాడని… ప్రభుత్వ ఉద్యోగిగా కొనసాగనివ్వకుండా చేస్తానని బెదిరిస్తోన్నాడని నేడు ఆమె గ్రీవెన్స్ లో కన్నీరుమున్నీరవుతూ ఫిర్యాదు చేశారు. 

కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బంటుమిల్లికి చెందిన ఏలూరు రంగబాబు, పవన్ కుమార్, శేషుబాబులు నేడు గ్రీవెన్స్ లో మంత్రికి ఫిర్యాదు చేస్తూ.. బంటుమిల్లి సబ్ రిజిస్ట్రార్ గా ఉన్న కె. శ్రీనివాసరావు ల్యాండ్ మాఫియా, కబ్జాదారులతో చేతులు కలిపి డబ్బులు తీసుకొంటూ.. అక్రమంగా ఫేక్ డాక్యూమెంట్లు సృష్టిస్తోన్నారని.. గతంలో కూడా గుడివాడ సబ్ రిజిస్ట్రార్ గా చేసినప్పుడు ఒక రిటైర్డ్ జడ్జిగారి ఆస్తికి భూ కబ్జాదారులతో కలిసి అక్రమాలకు పాల్పడ్డారని అలాగే నేడు తమ ఆస్తులను కొట్టేయడానికి ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించేందుకు యత్నిస్తోన్నాడన్నారు.. తమ దగ్గర ఉన్న వర్జినల్ పాసు పుస్తకాలు చూపించినా.. సబ్ రిజిస్ట్రార్ బుద్ధి మారకుండా కబ్జాదారుల దగ్గర 30 లక్షలు లంచం తీసుకోని  తప్పుడు పత్రాలు సృష్టించేందుకు యత్నిస్తోన్నాడని నేడు బాధితులు గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు. 

APSSAAT–RD సంస్థ నందు గత 10 సంవత్సరాలుగా DRP లుగా విధులు నిర్వహిస్తున్న సమయంలో కొందరి అధికారులు పక్షపాత ధోరనితో తమను తాత్కాలికంగా ఉద్యోగాలనుండి తొలగించారని..  దీనిపై పోరాటం చేసి హైకోర్టుకు వెళ్లగా… తమను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు చెప్పినా.. కాని డైరెక్టర్  ఎమ్. జగదీష్  తమను ఉద్యోగాల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని.. నేడు గ్రీవెన్స్ లో బాధితులు వాపోయారు. తాము ఆఫీసుకు వెళితే జగదీష్ వాళ్ల భావ ఎమ్మెల్సీ  అరుణ్ కుమార్ తో చెప్పి చర్యలు తీసుకొంటామని బెదిరిస్తోన్నారని వాపోయారు. 

తాను టీడీపీలో పనిచేస్తోన్నానని… తన అక్కకి దివ్యాంగురాలికి పింఛన్ రాకుండా 2019 లో వైసీపీ నేతలు కట్ చేయించారని దీంతో మనస్తానికి గురైన తన ఆక్క ఆత్మ హత్య చేసుకొందని.. ఆ పింఛన్ పైనే తన తల్లి ఆధారపడి జీవించేదని..  తాము పనులకోసం వలసలు పోవడం వలన తమ తల్లిని దగ్గర ఉండి  చూసుకోలేని పరిస్థితి లేదని… కావున దయచేసి తన తల్లికి పింఛన్ మంజూరు చేయాలని  అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నక్కనదొడ్డి  గ్రామానికి చెందిన శంకర్ నాయక్ వాపోయాడు.

అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం పాల్తేరు గ్రామానికి చెందిన దేవవరపు రఘు విజ్ఞప్తి చేస్తూ.. తమ భూమిని అక్రమంగా 22 ఏలో నమోదు చేశారని.. దాంతో ప్రభుత్వం నుండి తమ భూములకు రావాల్సిన బెన్ఫిట్స్ అందడంలేదని.. అక్రమ నమోదును తొలగించి రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాడానికి అవకాశం ఇవ్వాలని వేడుకున్నాడు. 

తూర్పు గోదావరి జిల్లా  తుని మండలం డి.పోలవరం గ్రామానికి చెందిన లగుడు రమణమ్మ విజ్ఞప్తి చేస్తూ.. తన తల్లి వీలునామా ద్వారా తనకు సంక్రమించిన 1.25 ఎకరాలను తన సోదరుడు గుడపర్తి అప్పలనాయుడు అధికారులతో కుమ్మక్కై రెవెన్యూ రికార్డుల్లో తన పేరును తొలగించారని.. అక్రమంగా తన పేరును రికార్డుల్లో అధికారులు, తన సోదరుడిపై చర్యలు తీసుకోవాలని.. తన పేరును రెవెన్యూ రికార్డుల్లో యధావిధిగా ఉంచాలని ఆమె విజ్ఞప్తి చేశారు. 

పట్టుగూళ్లుకొని రీలింగ్ చేయుటకు సరిపడు స్థలం లేక స్థలం కోసం అదికారులకు విన్నవించుకోగా..  సెలక్షన్ కమిటీ మెంబర్స్ ద్వారా రెండు సంవత్సరాల క్రితం మదనపల్లిలోని సిల్క్ రీలింగ్ కాలనీలో  డీఐపీ సిస్టమ్ ద్వారా 11 మందికి స్థలం మంజూరు చేయుటకు సిఫారుసు చేశారు అది పెండింగ్ లో ఉండగా .. ఇటీవల రిటైర్డ్ అయిన డీఎస్ఓ రాజశేఖర్ రెడ్డి వైసీపీ వారికి మాత్రమే స్థలాలు అగ్రిమెంట్ చేసి తాను డబ్బులు ఇవ్వని కారణంగా.. టీడీపీ వ్యక్తి అన్న సాకుతో తనకు స్థలాన్ని అగ్రిమెంట్ చేయలేదని.. దీనిపై సెరికల్చర్ డీడీ గుంటూరులో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అతను వాపోయాడు. 

ప్రకాశం జిల్లా దర్శిమండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన ఏడుకొండలు విజ్ఞప్తి చేస్తూ.. 2018 లో గ్రామంలోని బీసీ కాలనీలో సీసీ రోడ్లు నిర్మాణం చేపట్టామని వాటికి సంబంధించిన బిల్లులు ఇంకా రాలేదని  ఆ బిల్లులను వెంటనే ఇప్పించాలని ఆయన విజ్ఞప్తి చేశాడు. 

రూరల్ ప్రాంతాల్లో పనిచేస్తోన్న డాక్టర్లకు గతంలో పీజీ కోర్సుల్లో చేరేవారికి 30 శాతం రిజర్వేషన్ కల్పించేవారని.. దాన్ని నేడు జీవో నెంబర్ 85 ను తీసుకొచ్చి 15 శాతానికి తగ్గించారని.. దాంతో పాటు కాలేజీలను కూడా కుదించారని. దాని వలన ప్రభుత్వ డాక్టర్లకు అన్యాయం జరుగుతోందని.. కాంట్రాక్ట్ పద్దతిలో ప్రైవేట్ డాక్టర్లను ప్రోత్సహిస్తూ.. వారికి రూ. 3 లక్షల వరకు జీతాలు చెల్లిస్తోన్నారని.. తమకు అంత జీతాలు ఇవ్వకపోయినా.. పీజీ పూర్తిచేయడానికి గతంలో ఇచ్చిన రిజర్వేషన్ ను కొనసాగించి దానికి తగిన వేతనం ఇచ్చేలా చూడాలని పలువురు డాక్టర్లు నేడు గ్రీవెన్స్ లో విజ్ఞప్తి చేశారు.   

తన పేరు ఘాన్సీ రాణి అని. తనుకు ఇప్పటికే 76 సంవత్సరాలు వచ్చాయని. కనదుర్గమ్మ వారధి నిర్మాణం అని చెప్పి.. తన తండ్రి ఇచ్చిన స్థలాన్ని ప్రభుత్వం తీసుకోని ఎటువంటి పరిహారం ఇవ్వలేదని.. స్థలాలు కోల్పోయిన బాధితులకు డబ్బులు స్థలాలను పరిహారంగా ఇచ్చినా తనకు మాత్రం ఏ పరిహారం ఇవ్వకుండా అన్యాయం చేశారని ఆమె గ్రీవెన్స్ లో వాపోయారు. తన భర్త చనిపోయాడని వృద్ధాప్యం కారణంగా ఏ పనిచేసుకోలేనని. ఉన్న స్థలాన్ని కూడా ప్రభుత్వం లాక్కొని అన్యాయం చేసిందని వాపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here