మహిళా మోర్చా రికార్డు స్థాయిలో సభ్యత్వ నమోదు చేయాలి… బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి

Spread the love

మహిళా మోర్చా రికార్డు స్థాయిలో సభ్యత్వ నమోదు చేయాలి… బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి

విజయవాడ..భారతీయ జనతాపార్టీ మహిళా మొర్చా ఆంధ్రప్రదేశ్  సభ్యత్వనమోదు వర్క్ షాప్ ఈ రోజు విజయవాడ స్టేట్ ఆఫీస్ లో ఉదయం 10గం” జరిగింది…ఈ వర్క్ షాప్ కి ముఖ్య అతిథులుగా రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు, ఆంధ్రపదేశ్ స్టేట్ ప్రెసిడెంట్  పురంధేశ్వరి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహిళలు కు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు.

మహిళలు తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు.బిజెపి సభ్యత్వ నమోదు లో మహిళా మోర్చా కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.

మహిళా మొర్చా స్టేట్ అధ్యక్షురాలు  నిర్మలా కిషోర్ సమావేశానికి అధ్యక్షత వహించారు,నేషనల్ సోషల్ మీడియా ఇన్చార్జి ,ఆంధ్రప్రదేశ్ సభ్యత్వ నమోదు ప్రభారీ  సుజాత పాడే   పాల్గొని సభ్యత్వ  నమోదు గురించి వివిధ అంశాలపై దిశా నిర్దేశం చేయటంతో పాటు ఆంధ్ర రాష్ట్రం లో అత్యధిక సభ్యత్వాన్ని ఎలా నమోదు చెయ్యాలి అనే  విషయాలను  చర్చించటం జరిగింది..

అలాగే జిల్లా, మండల స్థాయి సమావేశాలు కూడా నిర్వహించుకోవాలి అని సూచించటం జరిగిందింది..ఈ సమావేశంలో  మహిళా మొర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,జిల్లాస్థాయి,మండల స్థాయి సభ్యులు పెద్దఎత్తున పాల్గొని తమ తమ జిల్లాలలో,మండలాల్లో అత్యధికంగా సభ్యత్వ నమోదు, కార్యాచరణ దిశగా సమావేశం విజయవంతమైనది.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *