Home Political news “సెక్స్ వర్కర్ల పిల్లల హక్కుల రక్షణ బాధ్యత –బాలల కమిషన్ చేపడుతుంది”

“సెక్స్ వర్కర్ల పిల్లల హక్కుల రక్షణ బాధ్యత –బాలల కమిషన్ చేపడుతుంది”

3
0

“సెక్స్ వర్కర్ల పిల్లల హక్కుల రక్షణ బాధ్యత –బాలల కమిషన్ చేపడుతుంది”

విజయవాడ: ఆగస్టు 28: 

సెక్స్ వర్కర్ల పిల్లల హక్కుల రక్షణ బాధ్యత  రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చేపట్టడమే కాకుండా వారి పిల్లలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు నివారించడం కోసం రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ప్రత్యేకంగా ద్విముఖ వ్యూహం రూపొందించి ప్రభుత్వం ద్వారా అమలు చేయడానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించనున్నట్లు రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ రాష్ట్ర సభ్యులు డాక్టర్ జే రాజేంద్రప్రసాద్ వెల్లడించారు.

బుధవారం స్థానిక మనోరమ హోటల్లో రాష్ట్ర బాలల హక్కుల  పరిరక్షణ కమిషన్ మరియు హెల్ప్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో “వేశ్యవృత్తిలోని మహిళల పిల్లల విద్య వారి దుర్బలత్వం” పై నిర్వహించిన స్టడీ రిపోర్టును రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యులు శ్రీమతి బి. పద్మావతి, అదిలక్షి, డాక్టర్ రాజేంద్రప్రసాద్ కలిసి సంయుక్తంగా విడుదల చేశారు.

శ్రీ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఈ స్టడీ నివేదిక ద్వారా వెలుగులోకి వచ్చిన సమస్యల ఆధారంతో  ద్విముఖ వ్యూహం  ద్వారా  ముఖ్యంగా రెండు జనరేషన్ బాలలకు సంబంధించి మొదటగా తమ తల్లి వద్ద ఉంటున్న పిల్లలకు ఇప్పుడే పుట్టిన పిల్లలకు ప్రత్యేకంగా వారినే ఉద్దేశించే కార్యక్రమాలు రూపొందించాలని అలాగే 15 సంవత్సరాలు దాటిన పిల్లలకు జీవన నైపుణ్యాలు, వృత్తి విద్యా శిక్షణలు అందించి వారు స్వతంత్రంగా బతికేవరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి ఉపాధి కల్పన కార్యక్రమాలు చేపట్టివల్సి ఉందన్నారు..

 

రాష్ట్ర బాలల కమిషన్ సభ్యులు శ్రీమతి బి. పద్మావతి మాట్లాడుతూ రాష్ట్రంలో రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ నిర్వహిస్తున్న టార్గెట్ ఇంటర్వెన్షన్ లో సెక్స్ వర్కర్లు కాక వారి పిల్లలకు కూడా విద్య ,మెంటల్ హెల్త్ ,న్యూట్రిషన్ ,బాలల అభివృద్ధి అంశాలు కూడా జోడించి నూతన కార్యక్రమాలు చేపడితే బాగుంటుందన్నారు.

మరో సభ్యురాలు శ్రీమతి ఆదిలక్ష్మి మాట్లాడుతూ సెక్స్ వర్కర్ల పిల్లల్లో 37 శాతం మంది స్కూల్ బయటనే ఉంటున్నారని ఈ స్టడీ ద్వారా తెలియడం తమకు షాకింగ్గా ఉందన్నారు. 

 నాగార్జున యూనివర్సిటీ సోషల్ వర్క్ ప్రోఫెసర్ డాక్టర్ సరస్వతీ రాజు అయ్యర్ మాట్లాడుతూ ఈ స్టడీ ద్వారా సెక్స్ వర్కర్ల పిల్లలు స్కూలులో, సమాజంలో, ఇతర పిల్లల వల్ల ఎగతాళి, వివక్షత ఎదుర్కొంటున్నారని ఫలితంగా పాఠశాలలకు దూరంగా బడి బయట ఉంటున్నారని అంటూ స్టడీ అంశాలు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నోడల్ ఆఫీసర్ శ్రీ ఎం సోమశేఖర్,  హెల్ప్ కార్యదర్శి నిమ్మరాజు రామ్మోహన్,  ప్రోగ్రామ్ మేనేజర్ వి భాస్కర్ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here