తిరుమల శ్రీవారికి చెన్నైకి చెందిన టివిఎస్ మోటార్స్ ఎండి శ్రీ వేణు సుదర్శన్ శుక్రవారం టీటీడీకి 16 ద్విచక్ర వాహనాలను విరాళంగా అందించారు.

Spread the love

 తిరుమల, 2024 ఆగష్టు 30

టీటీడీకి 16 ద్విచక్ర వాహనాలు విరాళం

 తిరుమల శ్రీవారికి చెన్నైకి చెందిన టివిఎస్ మోటార్స్ ఎండి శ్రీ వేణు సుదర్శన్ శుక్రవారం టీటీడీకి 16 ద్విచక్ర వాహనాలను విరాళంగా అందించారు. 

     ముందుగా అలయం వద్ద ఈ వాహనాలకు జరిగిన పూజలో టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలరావు,  అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. అనంతరం దాత వారికి వాహనాల తాళాలను అందజేశారు.

      16 ద్విచక్ర వాహనాలలో  15 ఎలక్ట్రికల్ ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. ఈ వాహనాల ధర దాదాపు రూ.22 లక్షలు అని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

        ఈ కార్యక్రమంలో తిరుమల డిఐ శ్రీ  సుబ్రహ్మణ్యం, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *