దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వద్ద మాట్లాడుతూ
– ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
– మొదటిరోజు సాయంత్రం నాటికి 49 వేల మంది, రెండో రోజు 65,000 మంది, మూడో రోజు అంటే శనివారం రాత్రి 9 గంటల వరకు 57,146 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.
– భక్తులందరికీ సంతృప్తికరంగా అమ్మవారి దర్శనం, ఆశీస్సులు లభిస్తున్నాయి.
– అధికారులందరూ సమన్వయంతో పనిచేస్తూ భక్తులకు సేవలు అందిస్తున్నారు.
– శనివారం మూడో రోజు మధ్యాహ్నం 18 వేల మందికి అన్న ప్రసాద వితరణ చేయడం జరిగింది. అదేవిధంగా ఉదయం 9,000 మందికి కట్టె పొంగలి అందించడం జరిగింది.
– 90 వేల లడ్డూలను విక్రయించడం జరిగింది. అడిగిన వారికి లేదనకుండా లడ్డు ప్రసాదాన్ని అందించడం జరుగుతోంది.
– స్వచ్ఛంద సంస్థల ద్వారా 4000 లీటర్ల పాలు, మూడు వేల లీటర్ల మజ్జిగ భక్తులకు అందించడం జరిగింది.
– రేపటి నుంచి క్యూ లైన్ లో వేచి ఉండే చిన్నపిల్లలను దృష్టిలో ఉంచుకొని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ద్వారా పాలు, మజ్జిగను అందించడం జరుగుతుంది.
– గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
– *ప్రసాదం తయారీలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం.*
– దుర్గా ఘాట్లో నవ హారతులు కార్యక్రమం వైభవోపేతంగా జరుగుతోంది. అనుభవజ్ఞుల సూచనల మేరకు మరింత వైభవంగా కార్యక్రమాలు నిర్వహిస్తాం.