విజయవాడ..
బిజెపి రాష్ట్ర కార్యాలయం లో వారధి కార్యక్రమం లోపాల్గొన్న బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు
*బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు..*
ప్రజల సమస్యలు పరిష్కారం కోసం వారధి ఒక చక్కని కార్యక్రమం
అన్ని వర్గాల ప్రజలు ఈ వారధిని సద్వినియోగం చేసుకుంటున్నారు
సమస్యలు ను సంబంధిత శాఖలకు పంపి పరిష్కారం చూపేలా చేస్తున్నాం
*దేశంలో మోడీ పాలనని అప్రతిష్ట పాలు చేసేందుకు హర్యానా నుండి కాంగ్రెస్ విస్తృతంగా పనిచేసింది* ..
*రైతుల పోరాటం లో విషయంలో …పొగాకు విషయంలో కూడా కాంగ్రెస్ రాజకీయాలు చేసింది..*
*ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలు వినియోగించుకుని కాంగ్రెస్ చేసిన రాజకీయాన్ని హర్యానా ప్రజలు తిప్పికొట్టారు..*
*ఈ విజయం భారతదేశంలో అభివృద్ధికి బాటలు వేసింది.*
*హర్యానా లో మూడో సారి విజయం సాధించటం అంటే మాములు విషయం కాదు*..
భిన్నమైన పాలన చేయటం బీజేపీ కె సాధ్యం అయ్యింది..
మహారాష్ట్ర, జార్ఖండ్ లలో ఇదే విజయాన్ని కైవసం చేసుకుంటాం
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనే గెలుపు కు బాటలు వేసింది
*హర్యానా:*
ప్రేరేపిత ఉద్యమాలు హర్యానా ప్రజల్లో మొదీ ప్రభుత్వం పట్ల విశ్వాసాన్ని తగ్గించలేకపోయాయి.
మోదీ ప్రభుత్వం ప్రజా శ్రేయస్సుకు చేస్తున్న పనులను హర్యానా ప్రజలు గుర్తించారు.
ఉద్వేగం , ఉద్రిక్తతలకు తావు లేకుండా ఉన్నతంగా ఆలోచించి హర్యానా ప్రజలు తీర్పునిచ్చారు.
*జమ్మూ – కాశ్మీర్ :*
ఉగ్రవాదాన్ని నిర్మూలించే లక్ష్యంతో , కాశ్మీర్ లో ఉగ్రవాద కార్యకలాపాలను నిలువరించగలిగాము.
సురక్షితమైన పర్యాటక ప్రాంతంగా కాశ్మీర్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో మేము విజయం సాధించాము.
ఆంక్షలు లేని పరిస్థితిని నిర్మాణం చేసి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిచి విజయం సాధించాము.
సైన్యానికి విశేష అధికారాలను కల్పించి భద్రత విషయంలో కాశ్మీర్ లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాం.
ఉగ్రవాదాన్ని పూర్తి స్థాయిలో నిర్మూలించి త్వరలోనే అధికారం చేపడతాం.
పాత్రికేయుల సమావేశంలో బిజెపి నేతలు పి. సురేందర్ రెడ్డి, బాలకృష్ణ యాదవ్, వారధి సమన్వయ కర్త కిలారు దిలీప్ తదితరులు పాల్గొన్నారు
అనంతరం బిజెపి రాష్ట్ర కార్యాలయం లో వేడుకలు ఘనంగా నిర్వహించారు.హర్యానా గెలుపు తో మిఠాయి లు పంచారు. ఈ వేడుకలో బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయచౌదరి, మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, బిజెపి రాష్ట్ర కార్యాలయం ఇంఛార్జి శివా మకుటం, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బబ్బూరి శ్రీరామ్ పీయూష్ దేశాయ్, సూర్య తేజ, గాజుల వెంకయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు
నేడు హర్యానా రేపు మహారాష్ట్ర, జార్ఖండ్ అంటూ నినాదాలు మిన్నంటాయి