దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్న ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో కొలువైయున్న జగన్మాతకు రాష్ట్రంలోని వివిధ దేవాలయాల నుంచి సారె సమర్పించడం సాంప్రదాయంగా వస్తోంది. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లా లోని కాణిపాకం
వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం తరపున ప్రత్యేక బృందం శ్రీ మహాలక్ష్మి దేవి అలంకృత అమ్మవారికి పట్టు వస్త్రాలు, సారె సమర్పించారు. ఇంద్రకీలాద్రి ఈవో కే రామారావు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు