ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో దుర్గా శరన్నవరాత్రులు వైభవోపేతంగా జరుగుతున్నాయి. బుధవారం సాయంత్రం ఇంద్రకీలాద్రిపై ఆది దంపతుల నగరోత్సవం నేత్ర పర్వంగా సాగింది. పవిత్ర మూలా నక్షత్రం
రోజున శ్రీ సరస్వతీ దేవి అలంకృత అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్దఎత్తున తరలివచ్చిన భక్తజనుల జయ జయ ధ్వానాల మధ్య నగర ఉత్సవం కనుల పండువగా సాగింది